Tamil Producers Council: తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం!

ABN, Publish Date - Jul 29 , 2024 | 08:39 PM

తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి (Producers Council) సంచలన నిర్ణయం తీసుకుంది. నటీనటులపై భారీ వేటు వేయడానికి సన్నాహాలు చేస్తోంది.

తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి (Producers Council) సంచలన నిర్ణయం తీసుకుంది. నటీనటులపై భారీ వేటు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. అడ్వాన్స్‌లు తీసుకొని పూర్తి చేయని నటీనటులపై యాక్షన్ తీసుకోవడానికి నిర్మాతల మండలి రంగం సిద్ధం చేస్తోందని తమిళనాట టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు ఆగస్ట్‌ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్‌ నిలిపివేసిన నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. సెట్స్‌ మీదకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్‌ మొదలుపెట్టాలనే రూల్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ పెండింగ్‌, ఇచ్చిన అడ్వాన్స్‌ల పై నిర్మాతలను నిర్మాతల మండలి నివేదిక అడిగింది.

ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్‌ షిట్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై ఏ హీరోహీరోయిన్‌ కూడా అడ్వాన్స్‌ తీసుకోవడం నిషేధం అని వెల్లడించింది. నటుడు ధనుష్‌ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిసింది. అడ్వాన్స్‌  తీసుకొని షూటింగ్స్‌ పూర్తి చేయడం లేదని ఇప్పటికే ధనుష్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఇకపై ధనుష్‌ (Dhanush) సినిమా అంగీకరించాలంటే నిర్మాతల మండలి అనుమతి ఉండాల్సిందేనట. దీన్ని బట్టి చూస్తే తమిళ చిత్ర పరిశ్రమ భారీ మార్పునకే శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. 

Updated Date - Jul 29 , 2024 | 08:39 PM