Sudeep: అంత్యక్రియలు కన్నా.. రీల్స్‌ ముఖ్యమా.. సుదీప్‌ కూతురు ఫైర్‌

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:10 PM

నటుడు కిచ్చాసుదీప్‌ తన తల్లి సరోజా సంజీవ్‌ గురించి భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఆదివారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస సుదీప్‌ మాతృమూర్తి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే!

నటుడు కిచ్చాసుదీప్‌ (Kichcha Sudeep) తన తల్లి సరోజా సంజీవ్‌ (Saroja Sanjeev) గురించి భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఆదివారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస సుదీప్‌ మాతృమూర్తి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే!  ఆయన కుమార్తె శాన్వీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ (Shanvi) ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. నాన్నమ్మ తో దిగిన ఫొటోను పంచుకున్న శాన్వీ ‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని క్యాప్షన్‌ పెట్టారు. "నాన్నయ్య పోయిన బాధలో మేముంటే, మా బాధ కన్నా రీల్స్‌కు ప్రాధాన్యమిచ్చిన కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు అంతరాయం కలిగించారు. ‘నాయనమ్మను కోల్పోయిన దుఃఖంలో ఉంటే.. కొందరు వ్యక్తులు నా మొహంపై కెమెరాలు పెట్టారు. బాధలో ఉన్న వ్యక్తిపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు. వారి కారణంగా నేను నాయనమ్మకు సరైన సెండాఫ్‌ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వారు అలాగే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే.. జనాలు ఆయన్ని నెట్టేశారు. కొందరు ఆయన మీద పడి లాగడం మొదలుపెట్టారు. మరికొందరు ఆయన్ని ఫొటోలు తీశారు. వారికి రీల్స్‌పై ఉన్న శ్రద్థ మరొకరి భావోద్వేగాలను అర్థంచేసుకోవడంలో లేదు’ అని శాన్వీ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు.



సుదీప్‌ కూడా తల్లిని తలుచుకుంటూ ఎమోషసల్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో సుధీర పోస్ట్‌ పెట్టారు. ‘ఇన్నిరోజులు మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత నా తల్లి.  ఆమె నా గురువు. నా మొదటి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే. 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేక పోతున్నా. ఇకపై నాకు ‘గుడ్‌ మార్నింగ్‌ కన్నా’ అనే  మెసేజ్  రాదు. శుక్రవారం చివరిసారి  మెసేజ్  పెట్టింది. శనివారం బిగ్‌బాస్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్‌ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లాను. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్‌ చేశా. షూటింగ్‌ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయాను. ఆదివారం ఉదయం ఆమె శాశ్వతంగా దూరమైంది. చూస్తుండగానే కొన్ని గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన మా అమ్మ.. కొన్ని గంటల్లోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది’ అని కిచ్చా సుదీప్‌ తన బాధను వ్యక్తం చేశారు. 

Updated Date - Oct 21 , 2024 | 03:19 PM