khushboo: ఖుష్బూ సంచలన పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి..

ABN, Publish Date - Sep 21 , 2024 | 08:44 PM

భార్యని గౌరవించని వాడు.. ఇతరుల మర్యాద పొందలేడంటూ ఘాటుగా స్పందించారు నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ(khushboo).

భార్యని గౌరవించని వాడు.. ఇతరుల మర్యాద పొందలేడంటూ ఘాటుగా స్పందించారు నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ(khushboo). తాజాగా ఆమో ఎక్స్‌ వేదికగా సుధీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకుంటాడు. ప్రేమించిన వారికి తొలి స్థానాన్ని ఇచ్చి.. అవసరాలు, కోరికలు, స్వేచ్ఛలకు రెండవ సంకేతానికి కేటాయిస్తాడు.. ప్రతి వివాహంలో ఎత్తుపల్లాలు సహజం. అలాగే చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఇలాంటి వాటివల్ల బంధాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. ఒక బంధంలో సమయానుకూలంగా ప్రేమ  కనుమరుగు కావచ్చు. కానీ గౌరవం, మర్యాద ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలి. ఒక పురుషుడు తప్పకుండా తన భార్యకు సరైన గౌరవాన్ని ఇవ్వాలి. స్వార్థంతో ఉండే వ్యక్తి.. తన చర్యల వల్ల యువ మనసులు ఏ విధంగా బాధపడతాయనేది చూడలేడు. ఇలాంటి ప్రవర్తన వల్ల అంతర్గతంగా కల్లోలం ఏర్పడుతుంది. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలకు తప్పకుండా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కాకపోతే అప్పటికే ఆలస్యం కావచ్చు. తన  భార్యను గౌరవించలేని వ్యక్తి.. ఇతరుల మర్యాద, జీవితంలో ఎదుగుదల ఆశించలేడు. నిన్ను ప్రేమించిన, నీకు తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరమైన విషయం. గౌరవం అనేది కుటుంబం నుంచి మొదలు కావాలి. ఈ ప్రాథమిక విషయాన్ని మరచిపోయిన వ్యక్తి.. ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పొయినట్టే’’ అని ఖుష్బూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఖుష్బూ చేసిన ఈ పోస్టుకు గల కారణం తెలియరాలేదు. అయితే నెటిజన్లు మాత్రం జయం రవి(Kayam Ravi), ఆర్తి (Aarti)విడాకులకు సంబంధించే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

జయం రవి, ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని జయం రవి ప్రకటించారు. దీనిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా విడాకులు ప్రకటన చేశారని ఆరోపించారు. బహిరంగ ప్రకటన చూసి దిగ్ర్భాంతికి గురైనట్లు సోషల్‌ మీడియా వేదికగా చెప్పారు. దీనిపై ఆర్తి కూడా స్పందించారు. ‘‘జయం రవి ప్రకటనతో షాకైనట్లు చెప్పారు ఆర్తి. ుూఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. న్యాయంగా నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా’’ అని ఆర్తి అన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 08:46 PM