Pongal: సంక్రాంతి రేసులో.. ఆ ముగ్గురు బ‌డా హీరోల‌ చిత్రాలు?

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:35 PM

వచ్చే యేడాది సంక్రాంతి రేసులో ముగ్గురు త‌మిళ అగ్ర హీరోలు వెండితెరపై తలపడనున్నారు. విశ్వనటుడు కమల్‌ హాసన్, అజిత్‌ కుమార్, శివకార్తికేయన్ వంటి ఉద్దండులు నటించిన చిత్రాలు ఈ పొంగల్‌కు విడుదల కానున్నాయి.

tamil

వచ్చే యేడాది సంక్రాంతి రేసులో ముగ్గురు త‌మిళ అగ్ర హీరోలు వెండితెరపై తలపడనున్నారు. విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan), అజిత్‌ కుమార్ (Ajith Kumar), శివకార్తికేయన్ (Siva Karthikeyan) వంటి ఉద్దండులు నటించిన చిత్రాలు ఈ పొంగల్‌కు విడుదల కానున్నాయి. ‘నాయకన్‌’ సినిమా తర్వాత 38 యేళ్ళ గ్యాప్‌ అనంతరం మణిరత్నం (Manirathnam), కమల్‌ హాసన్ (Kamal Haasan) కలిసి పనిచేస్తున్న ‘థగ్ లైఫ్‌’ (Thug Life) చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే డబ్బింగ్‌ ప్రారంభం కాగా, హీరో శింబు (SilambarasanTR) గెస్ట్‌ రోల్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా నిర్మాణాంతర పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే, మగిళ్‌ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వంలో హీరో అజిత్‌ కుమార్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘విదాముయార్చి’(Vidaamuyarchi). లైకా ప్రొడక్షన్ (Lyca Productions) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్ (Arjun Sarja) విలన్‌ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.


ఇకపోతే, ‘అయలాన్‌’ వంటి హిట్‌ తర్వాత శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ (Amaran) సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఆ తర్వాత ఏఆర్‌ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan) తన 23వ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే సింహ భాగం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రుక్మిణి వ‌సంత్ (RukminiVasanth) హీరోయిన్, అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్నాడు. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేశారు. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి విడుదలైతే అభిమానులకు సంక్రాంతి సంబురం రెట్టింపు కానుంది.

Updated Date - Aug 05 , 2024 | 02:35 PM