JR Ntr: కాంతార ప్రీక్వెల్‌.. రిషబ్‌శెట్టి ప్లాన్‌ చేస్తే నాకు ఓకే!

ABN, Publish Date - Sep 01 , 2024 | 05:40 PM

తన కుటుంబ సభ్యులతో కలిసి నటుడు ఎన్టీఆర్‌ (NTR) శనివారం కర్ణాటక వెళ్లిన విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో (Prashanth neel) కలిసి ఆ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించారు.


తన కుటుంబ సభ్యులతో కలిసి నటుడు ఎన్టీఆర్‌ (NTR) శనివారం కర్ణాటక వెళ్లిన విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో (Prashanth neel) కలిసి ఆ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన కొల్లూరులో మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. మూకాంబిక దేవాలయం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రిషబ్‌ శెట్టితో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉంది. ఆలయంలో సినిమా అప్‌డేట్‌పై స్పందించాలని లేదు. దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయి’’ అని సమాధానమిచ్చారు. ఓ విలేకరి.. ‘‘కాంతార’ ప్రీక్వెల్‌లో (Kantara Prequel) మీరు యాక్ట్‌ చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజం అని ప్రశ్నించగా ఎన్టీఆర్‌ నవ్వుతూ బదులిచ్చారు. ‘‘రిషబ్‌ శెట్టినే దానిని ప్లాన్‌ చేయాలి. ఆయన ప్లాన్‌ చేస్తే చేయడానికి నేను సిద్థంగా ఉన్నా’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.



రిషబ్‌శెట్టి హీరోగా.. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’. 2022లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వసూళ్ల వర్షం కురిపించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకోగా రూ.450 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు రిషబ్‌ శెట్టి. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్థమవుతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. 

Updated Date - Sep 01 , 2024 | 05:40 PM