Sardar2: కార్తీ కోసం ముగ్గురు భామలు? ఎక్క‌డా త‌గ్గ‌ట్లేరుగా!

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:06 PM

పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2022లో వచ్చిన ‘సర్దార్‌’ చిత్రానికి ప్ర‌స్తుతం రెండో భాగం తెరకెక్కుతుంది. హీరోయిన్లుగా తొలి భాగంలో నటించిన వారిని కాకుండా కొత్త వారిని తీసుకున్నారు.

sardar2

హీరో కార్తీ ముగ్గురు భామలతో రొమాన్స్‌ చేయనున్నారు. పీఎస్‌ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘సర్దార్‌’ (Sardar) చిత్రం రెండో భాగం తెరకెక్కుతుంది. తొలి భాగంలో హీరోయిన్లుగా రాశీఖన్నా (Raashi Khanna), రజీషా విజయన్ (RajishaVijayan ), లైలా నటించారు. ఈ సినిమా ప్రేక్షకాదారణ పొందడంతో పాటు నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాల పంట పడించింది.

ఇందులో హీరో కార్తీ (Karthi) రా అధికారిగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో తండ్రీకొడుకులుగా నటించారు. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. దర్శక నటుడు ఎస్‌జే సూర్య ( S J Suryah) వంటి పలువురు అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


అయితే, హీరోయిన్లుగా తొలి భాగంలో నటించిన వారిని కాకుండా కొత్త వారిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకోసం మాళవికా మోహనన్ (Malavika Mohanan), ప్రియాంకా మోహన్ (Priyanka Mohan)తో పాటు టాలీవుడ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథన్ (Ashika Ranganath)ను ఎంపిక చేసినట్టు సమాచారం.

అయితే, ఇప్ప‌టికే మాళ‌విక మోమ‌న‌న్‌, అషికల గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌గా ప్రియాంక మోహ‌న్ గురించి ఎంపికకు సంబంధించి నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.

Updated Date - Aug 05 , 2024 | 12:42 PM