Aryan Shyam: టీటీడీ అధికారులు.. ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారు

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:29 PM

త‌మిళ‌నాట యువ న‌టుడు ఆర్యన్‌ శ్యామ్ వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంటాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న గ‌త చిత్రాన్ని టీటీడీ అధికారులు మెచ్చుకున్న‌ట్లు తెలిపారు.

aryan

గ్రీన్‌ మ్యూజిక్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మితమైన ‘అందనాల్‌’ (Antha Naal) చిత్రంలో భయపెట్టే పాత్రలో ఆర్యన్‌ శ్యామ్ (Aryan Shyam,) నటించారు. వచ్చే నెలలో విడుదలకానున్న ఈ చిత్రం ఇప్పటికే పలు చిత్రోత్సవాలకు ఎంపికై, పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమా విడుదలకాకముందే ఆర్యన్‌ శ్యామ్‌కు వరుస చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా వరిస్తున్నాయి.

దీనిపై ఆర్యన్‌ శ్యామ్‌ మాట్లాడుతూ, ‘అందనాల్‌’ సినిమాలో ఓ మంచి పాత్ర ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అయితే, ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకుసాగాలన్న లక్ష్యంతో ఉన్నాను.


‘అందనాల్‌’ చిత్రానికి ముందు తిరుపతి వేంకటాచలపతి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘బ్రహ్మాండ నాయగన్‌’ అనే చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించాను. దానికి పేరు, ప్రశంసలు వచ్చాయి. నా నటనకు మెచ్చి యూత్‌ సూపర్‌స్టార్‌ అనే బిరుదును కూడా ప్రేక్షకులు ప్రదానం చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో విజయవంతంగా స్ట్రీమింగ్‌ అవుతుంది. టీటీడీ అధికారులు కూడా చిత్రాన్ని చూసి అభినందించి, చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. అయితే, శ్రీవారి భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం ఎంతో బాధించింది. దీనికి కారకులైన వారిని గుర్తించి శిక్షించాలి’ అని కోరారు.

Updated Date - Oct 04 , 2024 | 01:30 PM