Aarti Ravi: మౌనంగా ఉన్నానంటే... తప్పు చేసినట్లు కాదు

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:23 AM

తమిళ హీరో జయం రవి(Jayam Ravi), తన భార్య ఆర్తితో (Aarti) విడాకులు తీసుకున్న వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.

తమిళ హీరో జయం రవి(Jayam Ravi), తన భార్య ఆర్తితో (Aarti) విడాకులు తీసుకున్న వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల (Divorce) విషయంలో వెనక్కు తగ్గేదే లేదని రవి పేర్కొంటుండగా ఇప్పటికీ తన భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి అంటున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి విడాకులకు కారణం సింగర్‌ కనీషా అంటూ వార్తలొచ్చాయి. ఆమె స్పందించి తనను ఈ గొడవలోకి లాగొద్దని, మా ఇద్దరిది శారీరక బంధం కాదని తెలిపింది. మరో పక్క  జయం రవిని ఆర్తి ముప్పుతిప్పలు పెట్టిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అతని సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఆర్తి ఆధీనంలో ఉన్నాయని, వాటిని అతడికి అప్పగించకుండా ఇబ్బందిపెడుతోందని ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా సోషల్‌ మీడియాలో ఓ నోట్‌  విడుదలచేశారు.

‘నా వ్యక్తిగత జీవితం గురించి పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్‌ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను. అప్పుడు నా మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహ వ్యవస్థను నేను గౌరవిస్తాను.  ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే  బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్‌ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్తి పోస్ట్‌ చేశారు. 

Updated Date - Oct 01 , 2024 | 12:23 AM