Bigg Boss 8: ఆడియెన్స్ గోడు తెలిసినట్లుంది.. ఇంటి సభ్యులకు నాగ్ ఇచ్చిపడేశాడు

ABN, Publish Date - Oct 06 , 2024 | 10:01 AM

‘ఓరి బాబు ముందు వాడిని బయటికి పంపండిరా?’ అంటూ ఈ బిగ్‌బాస్ షో లో మణికంఠ ఓవరాక్షన్ చూస్తున్నవారంతా అనుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అదే నాగార్జున వరకు వెళ్లినట్లుంది.. మణికంఠకు ఇచ్చిపడేశారు.. బిగ్‌బాస్ 35వ ఎపిసోడ్ రివ్యూ..

King Nagarjuna BB8

ఈ వారం అంతా మణికంఠ ఏడుపులతో విసిగిపోయిన బిగ్‌బాస్ వీక్షకులకు కింగ్ నాగార్జున కాస్త ఉపశమనం కలిగించారు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మణికంఠకు కింగ్ నాగ్ ఇచ్చిన క్లాస్ చూసిన వారంతా.. హమ్మయ్యా.. మా గోడు అర్థమైనట్టుందని అనుకున్నారంటే.. ఈ వారం బిగ్‌బాస్‌లో మణికంఠ ఓవరాక్షన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎపిసోడ్ 35 విషయానికి వస్తే..

Also Read- Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ తనని ఎలా ప్రేమలో పడేశాడో.. అదితి చెప్పేసింది


ఏడ్వడమే స్ట్రాటజీగా పెట్టుకుని బిగ్ బాస్‌కి వచ్చావా? అంటూ మణికంఠకు కన్ఫెషన్ రూంలో కింగ్ నాగ్ క్లాస్ ఇస్తుంటే.. ‘ఓరి బాబు ముందు వాడిని బయటికి పంపండిరా?’ అంటూ ఈ షో చూస్తున్నవారంతా అనుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఫుడ్ గురించి ఇంత రచ్చా? నీ భార్య నీకు ఫుడ్ పంపలేదు.. కేవలం మెసేజ్ మాత్రమే పంపింది అంటూ నాగ్ మళ్లీ మణికంఠను కూల్ చేసిన విధానం అందరికీ తెగ నచ్చేసింది. కన్నీరు కాదు.. కసిగా ఆడు అంటూ నాగ్ ఇచ్చిన సలహాను మణికంఠ ఎంత వరకు పాటిస్తాడో చూడాలి. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇంటి సభ్యులతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌లో కూడా ఎక్కువ మంది మణికంఠనే టార్గెట్ చేయడం విశేషం. ఇతరుల గురించి ఆలోచించడు.. ఎప్పుడూ తన గురించి అంతా మాట్లాడుకోవాలని అనుకుంటూ అందరినీ విసిగిస్తుంటాడు. ఎదుటివారి పరిస్థితి ఏంటనేది తనకు అసలు అవసరం లేదు.. అంటూ మణికంఠకు చిరాకు పుట్టించే వ్యక్తి ట్యాగ్‌ని ఇచ్చింది ప్రేరణ. జెలసీ ట్యాగ్‌ని సీతకు ఇచ్చింది. సీత విషయంలో మణికంఠ మైండ్ సెట్‌కి క్లాస్ ఇచ్చారు నాగ్. సీత కూడా అందరినీ కార్నర్ చేస్తాడంటూ మణికంఠ మైండ్ సెట్ గురించి నాగ్‌కి తెలియజేసింది.

Also Read- Rajendra Prasad: అప్పట్లో తన కుమార్తెతో మాటల్లేవని బాధపడ్డ రాజేంద్రప్రసాద్ ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటాడో..


నబిల్, విష్ణుప్రియలు నా స్నేహితులని మణికంఠ చెబితే.. విష్ణు ప్రియ మాత్రం మణికంఠను బాగా ఇరికించేసింది. అతనికి సెల్ఫీష్ ట్యాగ్ ఇచ్చి.. అతనిలో ఒక్కరు కాదు.. చాలా మంది ఉన్నారని అనగానే.. అయితే మణికంఠ కాదు.. మెనీ కంఠ అంటూ నాగ్ చమత్కరించారు. నిఖిల్ చీఫ్ బాధ్యత తర్వాత చిన్న పిల్లాడు అయ్యాడని విష్ణుప్రియ అనగానే.. చీఫ్‌గా దిగిన తర్వాతా? లేక సోనియా వెళ్లిన తర్వాతా? అంటూ ఆట పట్టించాడు. ఇక ఈ గేమ్‌లో చాలా మంది మణికంఠకు చిరాకు పుట్టించే వ్యక్తి, సెల్ఫీష్ అంటూ ట్యాగ్స్ ఇవ్వగానే.. మళ్లీ మణి తన ఏడుపు స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు. నాగ్ ముందు కూడా మణికంఠ ఏడుపు సింపతీని ప్లే చేశాడు. కానీ నాగ్ మరోసారి తనకి.. ఇలా అయితే ఆడియెన్స్ నిన్ను భరించలేరు.. ఇక నీ ఇష్టం అంటూ మణికంఠకు, గేమ్ విషయంలో సరిగా ఆడటం లేదంటూ నైనికకు నాగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

చీఫ్‌గా సీత ఫెయిల్ అయిందని చెప్పిన నాగ్.. ప్రేరణపై మాత్రం ప్రశంసలు కురిపించారు. అలాగే పృథ్వీ‌, నబిల్‌లపై ప్రశంసలు కురిపిస్తూ.. ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న నిఖిల్, నబిల్ ఫేస్ అయినట్లుగా నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం‌ని నాగ్ స్టేజ్‌పైకి పిలిచించి.. హౌస్‌లోని వారి ప్రవర్తన గురించి చెప్పించారు. ఇంటి సభ్యులకు ఆదిత్యం ఓం కొన్ని సలహాలు ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. ఓవరాల్‌గా అయితే.. నాగార్జున పంచ్‌లు, ఆదిత్య ఓం స్టేజ్ మీద స్పీచ్ మినహా.. ఈ ఎపిసోడ్ కూడా పరమ రొటీన్ అనేలానే సాగింది.

Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2024 | 10:01 AM