Bigg Boss 8: అయ్యబాబోయ్.. ఏంటీ డ్రామా.. తట్టుకోలేకపోతున్నాం బిగ్ బాస్

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:20 AM

తెలుగు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఇప్పుడు 8వ సీజన్‌కు చేరుకుంది. ప్రతి సీజన్‌కు ముందు ఈసారి అంతకు మించి అనేలా.. కింగ్ నాగార్జున చెబుతూనే ఉంటారు కానీ.. అంతలేదు అక్కడ అన్నట్లుగా ఈ షో వెళుతోంది. ఇక ఈ సీజన్ ఎపిసోడ్ 34 రివ్యూకి వెళితే..

Bigg Boss Telugu Season Episode 34

తెలుగు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఇప్పుడు 8వ సీజన్‌కు (Bigg Boss 8) చేరుకుంది. ప్రతి సీజన్‌కు ముందు ఈసారి అంతకు మించి అనేలా.. కింగ్ నాగార్జున (King Nagarjuna) చెబుతూనే ఉంటారు కానీ.. ఆ షో చూస్తుంటే పరమ రొటీన్ అన్నట్లుగా నడుస్తోంది. ఎప్పుడూ చూడు.. ఆ ఏడుపులు, పెడబొబ్బలు తప్పితే.. ఎంటర్‌టైన్‌మెంట్ వే లో మాత్రం ఈ షో నడవడం లేదని చెప్పుకోవాలి. ఒక ఫ్యామిలీ అంతా ఈ షో చూస్తున్నప్పుడు హాయిగా నవ్వుకోవాలి గానీ, ఛీ ఛీ ఇదేం షో అని రిమోట్ తీసుకుని వెంటనే ఛానల్ మార్చేలా ఉండకూడదు. ఈ లాజిక్‌ని బిగ్ బాస్ ఎందుకు మిస్ అవుతున్నాడో మరి. కింగ్ నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ తప్పితే.. మిగతా రోజుల్లో ఈ షోని ఎమోషన్స్‌తోనే నడపాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నట్లుంది. నిజంగా ఒక కుటుంబంలో ప్రతి రోజూ ఏడుపులు ఉండవు కదా.. ఆ షో చూస్తున్నప్పుడు మనం కూడా అందులో ఉంటే, మన ఫ్యామిలీ ఇదే కదా అనే ఫీల్ వచ్చేలా చేయగలగాలి.. కానీ బిగ్ బాస్‌లో అదే మిస్సవుతోంది. (Bigg Boss Telugu Season 8 Episode 34)

Also Read- Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే


ఇక శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ఎమోషన్స్ లెవల్ కాస్త శృతి మించిందనే చెప్పుకోవాలి. ఒకరిని మించి మరొకరు ఓవర్ యాక్షన్ చేస్తూ.. షో చూస్తున్న వారిని బాగా విసిగించేశారు. ఎప్పుడూ సీజన్ లాస్ట్‌లో వచ్చే ఎమోషనల్ టాస్క్‌లని ఈసారి బిగ్ బాస్ ముందు నుంచే ప్లాన్ చేయడంతో.. కంటెస్టెంట్ల ఎమోషన్స్ కూడా చాలా కృత్రిమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ఎపిసోడ్‌లో మణికంఠ, సీతల మధ్య కోట్లాట, కావాలని క్రియేట్ చేసినట్లుగా అనిపిస్తుంది తప్పితే.. సహజంగా మాత్రం అనిపించదు. మళ్లీ ఈ కోట్లాటకు ఇతర సభ్యుల మద్దతు అనే గేమ్ ఒకటి.

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్


నిఖిల్, పృథ్వీ, విష్ణు, యష్మీ, నబిల్ ముచ్చట్లు మొదలుకుని.. మణికంఠ చెప్పే జాతకం, ఆ టైమ్‌లో విష్ణుప్రియ ఓవరాక్షన్ టీవీ చూస్తున్న వీక్షకులకు అసహ్యం వేసేలా అనిపిస్తుంది. ఇక యష్మీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సోనియా రోల్ పోషిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిఖిల్, పృథ్వీలతో ఆమె రాసుకుని, పూసుకుని తిరుగుతూ.. వారంటే ఇష్టమన్నట్లుగా బిగ్‌బాస్‌కి చెప్పింది. అంతేకాదు, హౌస్‌లో మణికంఠకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. ఆమె డిసైడ్ అయినట్లుగా మణికంఠ భార్య ప్రియ పంపిన ఫుడ్, నిఖిల్ మదర్ పంపిన ఫుడ్ విషయంలో యష్మీ, మణికంఠను కాదని నిఖిల్‌కి సపోర్ట్ ఇవ్వాలనుకోవడంతో.. మణికంఠ ఫైర్ అయిన విధానం, అలాగే ఎమోషనల్ అయిన విధానం అంతా కూడా ఆడియెన్స్‌కు చిరాకు తెప్పించి.. వెంటనే దుప్పటి కప్పుకుని పడుకునేలా చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి ఇలాంటి కృత్రిమ ఎమోషన్స్‌కి ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతారనేది బిగ్ బాస్ టీమ్ ఒకసారి పరిశీలిస్తే బెటర్.. లేదంటే టీఆర్పీ ఆశలు వదిలేసుకోవడమే.

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2024 | 08:20 AM