AM Rathnam Family: సంతోషంలో నిర్మాత ఏఎమ్ రత్నం ఫ్యామిలీ.. విశేషమిదే!

ABN, Publish Date - Jul 10 , 2024 | 09:31 PM

ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ఫ్యామిలీ అంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం వారి ఇంట మహాలక్ష్మీ జన్మించింది. ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ భార్య ఐశ్వర్య బుధవారం ఓ పండంటి పాపకు జన్మనిచ్చినట్లుగా ఆ ఫ్యామిలీ వెల్లడించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆ ఫ్యామిలీ పేర్కొంది.

AM Rathnam Family

ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం (AM Rathnam) ఫ్యామిలీ అంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం వారి ఇంట మహాలక్ష్మీ జన్మించింది. ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) భార్య ఐశ్వర్య (Aishwarya) బుధవారం ఓ పండంటి పాపకు (Baby Girl) జన్మనిచ్చినట్లుగా ఆ ఫ్యామిలీ వెల్లడించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ.. చిన్నారి రాకతో తమ ఇంట సంతోష కాంతులు నిండాయని చెప్పుకొచ్చారు.

Also Read- Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

నిర్మాత ఏఎం రత్నంకు ఇద్దరు కుమారులు. జ్యోతి కృష్ణ, రవి కృష్ణ. ఇద్దరూ కుమారులే కావడంతో.. ఇప్పుడు తమ ఇంట మహాలక్ష్మి జన్మించినట్లుగా అంతా సంబరం చేసుకుంటున్నారు. ‘7జి బృందావన కాలనీ’ సినిమాలో హీరోగా చేసిన రవి కృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. జ్యోతి కృష్ణ విషయానికి వస్తే.. గోపీచంద్‌తో ‘ఆక్సిజన్’, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ చిత్రాలను డైరెక్ట్ చేసి దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తన తండ్రి నిర్మిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్ర బ్యాలెన్స్ షూట్‌ను ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడమే ఒక హ్యాపీ న్యూస్ అనుకుంటే.. ఇప్పుడు ఓ పాప వారింట అడుగుపెడుతుండటంతో ఆ ఫ్యామిలీలో సరికొత్త ఆనందం నెలకొంది.


ఇక ఏఎమ్ రత్నం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ నిర్మాతగా ఆయన దూసుకెళుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నిర్మిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఇటీవల ఆయన చెప్పిన విశేషాలు సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశాయి. మనవరాలు అనే వార్తతో ఆయన మహదానందంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 09:31 PM