AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్

ABN , Publish Date - May 11 , 2024 | 04:36 PM

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌కు రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలని కోరుతూ.. డైరెక్ట్‌గా కొందరు, సోషల్ మీడియా వేదికగా మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు మద్దతు తెలపగా.. తాజాగా మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు సపోర్ట్ ఇస్తున్నారు.

AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్
Celebrities Support to Pawan Kalyan

జనసేన అధినేత (Janasena Chief), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)‌కు రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలని కోరుతూ.. డైరెక్ట్‌గా కొందరు, సోషల్ మీడియా వేదికగా మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటి నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. జనసేన పార్టీకి రూ. 5 కోట్ల రూపాయలు ఫండ్‌గా ఇచ్చిన చిరంజీవి.. రీసెంట్‌గా ఓ వీడియో వదిలి.. తన పూర్తి మద్దతు తన తమ్ముడికేనని స్పష్టం చేశారు. అలాగే పద్మ విభూషణ్ పురస్కరం అందుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి మరోసారి తన తమ్ముడిని గెలిపించాలని మీడియా ముఖంగా తెలియజేశారు.

*Elections 2024: ఓటు ఎంత బలమైనదో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది


ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి వారంతా డైరెక్ట్‌గా కొందరు, సోషల్ మీడియా వేదికగా మరికొందరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu), ఆయన సతీమణి పద్మజ (Padmaja) కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలోనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం పిఠాపురానికి రామ్ చరణ్ తన మదర్ సురేఖ (Surekha), మామ అల్లు అరవింద్‌ (Allu Aravind)తో కలిసి వెళ్లారు. అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం.. తన బాబాయ్‌ని భారీ మెజారీటీని గెలిపించాలని రామ్ చరణ్ పిఠాపురం ప్రజలను కోరారు.


Pawan-Kalyan.jpg

మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా.. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), తేజ సజ్జా (Teja Sajja), రాజ్ తరుణ్ (Raj Tarun), సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu), విరాజ్ అశ్విన్, కాదంబరి కిరణ్, రామజోగయ్య శాస్త్రి, సురేష్, నరేష్, అబ్బూరి రవి వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపగా.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ వంటి జబర్ధస్త్ బ్యాచ్ అంతా పిఠాపురం ఏరియాల్లో ఇంటింటికి తిరుగుతూ కొన్ని రోజులుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. జానీ మాస్టర్, ఆర్‌.కె. సాగర్ వంటి వారంతా జనసేన తరపున మొదటి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిర్మాత నాగవంశీ (Naga Vamsi) సైతం పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇప్పటి వరకు కామ్‌గా ఉన్న సెలబ్రిటీలు కొందరు.. ఇప్పుడు ఓపెన్‌గా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ.. పిఠాపురం ప్రజలు ఆయనని గెలిపించాలని కోరుతున్నారు.

Padmaja.jpg

రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar), శ్రీయా రెడ్డి (Shriya Reddy), సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రవి. కె చంద్రన్ (Ravi K Chandran), దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K Chandra) (‘భీమ్లా నాయక్’ దర్శకుడు), దర్శకుడు శ్రీరామ్ వేణు (Sriram Venu) (‘వకీల్ సాబ్’ దర్శకుడు), క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari), హీరో నితిన్, శశాంక్ వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరారు. ప్రస్తుతం వారి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 06:39 PM