మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pushpa 2: దర్శకుడిపై ఒత్తిడి చేస్తున్న నిర్మాతలు, లేకపోతే కోట్లలో నష్టం

ABN, Publish Date - Feb 14 , 2024 | 12:43 PM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' ఆగస్టు 15న విడుదలకాకపోతే నిర్మాతలకి భారీ నష్టం వాటిలో ప్రమాదం ఉందని, అందుకని నిర్మాతలు దర్శకుడు సుకుమార్ మీద ఒత్తిడి తెస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది.

Allu Arjun from Pushpa 2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే ఆగస్టు 15 న విడుదలవుతుంది అని ఈ చిత్ర నిర్వాహకులు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈమధ్య ఈ సినిమా విడుదలపై ఎన్నో వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని, అనుకున్న తేదీకి రాకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర నిర్వాహకులు ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యలేదు, కానీ పరిశ్రమలో కూడా ఈ సినిమా వాయిదా పడొచ్చు అని వినపడుతోంది.

అయితే ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ మీద ఇప్పటికే ఈ తేదీకి విడుదల చెయ్యాలన్న ఉద్దేశంతో చాలా ఒత్తిడి వున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ సినిమా తను అనుకునే విధంగా వచ్చేంతవరకు శ్రమిస్తూ వుంటారు, అలాగే సుకుమార్ చాలా టైము కూడా తీసుకుంటారు అని అతని మీద ఒక విమర్శ వుంది. అందుకని ఆగస్టు 15న ఎలా అయినా విడుదల అయ్యేట్టు ఈ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాకపోతే ఈ సినిమాకి సుమారు రూ. 200 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉందని అదే విషయం దర్శకుడు సుకుమార్ కి చెప్పడం జరిగిందని ఒక సమాచారం. అలాగే సుకుమార్ ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ 'పుష్ప 3' కూడా తీయాలను అనుకుంటున్నందు వలన, ఈ 'పుష్ప 2' లో కొన్ని సన్నివేశాలను సీక్వెల్ కి ఉంచి, ఈ 'పుష్ప 2' ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అవుతోందని, ఈ సినిమాలో నటిస్తున్న ముఖ్యమైన నటులు అందరూ పాల్గొంటున్నట్టు తెలిసింది.

Updated Date - Feb 14 , 2024 | 12:43 PM