Racharikam: రొమాంటిక్ సాంగ్‌తో మాయ చేస్తోన్న అప్సరా రాణి..

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:54 PM

అప్సరా రాణి పేరుకు ఓ హాట్‌నెస్‌ని ఇచ్చాడు ఆర్జీవీ. భూమ్ బద్దలు చేసిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గానూ తన టాలెంట్‌ని చూపిస్తోంది. ప్రస్తుతం కొత్త తరహా కథలకు ఆడియెన్స్ ఎలా పట్టం కడుతున్నారో తెలియంది కాదు. అలాంటి కథతో, ‘రాచరికం’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో అప్పరా రాణి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ రొమాంటిక్ మెలోడీని మేకర్స్ వదిలారు.

Racharikam Movie Still

అప్సరా రాణి (Apsara Rani) పేరుకు ఓ హాట్‌నెస్‌ని ఇచ్చాడు ఆర్జీవీ. భూమ్ బద్దలు చేసిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గానూ తన టాలెంట్‌ని చూపిస్తోంది. ప్రస్తుతం కొత్త తరహా కథలకు ఆడియెన్స్ ఎలా పట్టం కడుతున్నారో తెలియంది కాదు. మ్యూజికల్ నెంబర్స్ జనాలకు కనెక్ట్ అయితే చిత్రాలకు వచ్చే బజ్ గురించి అందరికీ తెలిసిందే. ఓ సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లాలంటే పాటలే ప్రధానం. అలా ఇప్పుడు ‘రాచరికం’ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌తో ఆడియెన్స్‌లోకి వెళ్లేలా మేకర్స్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి వచ్చిన ‘టిక్కు టిక్కు’ పాటను ఇది వరకు విడుదల చేయగా.. ఆ పాట మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Middle Class People: ఇలా అయితే.. మధ్య తరగతికి చెందిన వారు సినిమాకు వస్తారా?


అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ (Racharikam) అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ మంచి రొమాంటిక్, మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.


‘ఏం మాయని’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ పాటను హరి చరణ్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వేంగి ఈ పాటను లిరిక్స్ అందించారు. అలాగే ఆయన ఇచ్చిన బాణీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఈ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ రొమాంటిక్ మెలోడీ ట్రాక్ సినిమాపై కూడా భారీగా అంచనాలను పెంచేస్తోంది. హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2024 | 10:54 PM