Samyuktha: సంయుక్త ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌కు రానా క్లాప్.. ఈ జంటని ఎక్కడో చూసినట్టుందే..

ABN, Publish Date - Oct 09 , 2024 | 02:19 PM

ఇప్పటి వరకు హీరోల సరసన నటించిన సంయుక్త.. ఇప్పుడు సోలో హీరోయిన్‌గా ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా బుధవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ ప్రారంభ విశేషాల్లోకి వెళితే..

Samyuktha New Movie Opening

‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ ఒక జంటగా నటిస్తే.. మరో జంటగా రానా దగ్గుబాటి, సంయుక్త నటించారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత సంయుక్త పాత్రకు కూడా ఉంటుంది. ఆ పాత్రలు వారిద్దరికీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పటి వరకు హీరోల పక్కన నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త (Samyuktha).. తొలిసారి ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా.. ఈ సినిమాకు క్లాప్‌ను ‘భీమ్లా నాయక్’లో తనకు భర్తగా నటించిన రానా దగ్గుబాటి (Rana Daggubati) కొట్టారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

వరుస బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సంయుక్తనే సమర్పిస్తోంది. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Also Read- War 2: 'క్లైమాక్స్‌'కి తారక్ సై



గెస్ట్‌లలో వెంకీ కుడుముల, కోన వెంకట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్‌ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం. 6 ఓపెనింగ్‌కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఆరో సినిమా ఒక మిరాకిల్‌గా జరిగింది. సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే‌కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్‌లో ఇదే ఫస్ట్. అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ వున్న సినిమా ఇది. సంయుక్త ఓకే అంటేనే ఈ సినిమా చేద్దామని అనుకున్నాను. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాని చేయబోతున్నాం. మిగతా విషయాలన్ని టీజర్ విడుదల కార్యక్రమంలో తెలియజేస్తామని అన్నారు.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే


దర్శకుడు యోగేష్ కెఎంసి మాట్లాడుతూ.. ఈ కథ, చిత్రానికి రాజేష్ దండా, సంయుక్త కీలకం. కథ నచ్చి వెంటనే చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కథ ఎంతలా నచ్చిందని చెప్పడానికి ఉదాహరణ సంయుక్త‌ ఈ సినిమాను సమర్పిస్తుండటమే. సంయుక్త లాంటి గుడ్ పెర్ఫార్మర్‌తోనే ఈ సినిమా చేయాలని రాజేష్ గారు నిశ్చయించుకున్నారు. ఇదంతా దైవ సంకల్పం. మిగతా విషయాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

దర్శకుడు యోగేష్ KMC ఒక పవర్ ఫుల్ కథను రాశారు, ఇది థ్రిల్లర్ జానర్‌లో కొత్త పాయింట్. దర్శకుడు సంయుక్తను డైనమిక్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కొన్ని బ్రెత్ టేకింగ్ స్టంట్స్‌ని చేయబోతున్నారు. ఈ సినిమా అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 02:19 PM