మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sai Durga Tej: అల్లు హీరోను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు..

ABN, Publish Date - Jun 12 , 2024 | 05:19 PM

ఏపీ  ఎన్నికలకు ముందు నుంచే  సోషల్  మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ (mega Family vs allu family) వ్యవహారం చూస్తూనే ఉన్నాం. మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను (Allu arjun) టార్గెట్ చేశారు.

ఏపీ  ఎన్నికలకు ముందు నుంచే  సోషల్  మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ (mega Family vs allu family) వ్యవహారం చూస్తూనే ఉన్నాం. మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను (Allu arjun) టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోని వెనకేసుకు వస్తూ మెగా హీరోలను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది.  అయితే లేటెస్ట్ గా  మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ అటు అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని(Sneha reddy)  సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ట్విట్టర్,ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వారిద్దరిని అన్ ఫాలో చేసినట్లు వెల్లడయింది.  ప్రస్తుతానికి అల్లు కుటుంబం నుంచి కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయిధరమ్ తేజ్ (Sai dharam tej)ఫాలో అవుతున్నాడు.  మిగతా మెగా హీరోలందరూ ప్రస్తుతానికి అల్లు అర్జున్ ను  ఫాలో అవుతూనే ఉన్నారు. 

ఎన్నికలకు ముందు బన్నీ తన స్నేహితుడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్లిన సంగతి తెల్సిందే. అదే సమయంలో పిఠాపురం శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు కేవలం ట్వీట్ తో శుభాకాంక్షలు చెప్పి.. శిల్ప రవి కోసం నంద్యాల వెళ్లడంపై విమర్శలు ఎదురైనా సంగతి తెల్సిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ ను  మెగా అభిమానులే కాదు.. సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఆ వివాదం  సోషల్ మీడియాలో అలా కొనసాగుతూనే ఉంది. నాగబాబు కూడా పేర్లు చెప్పకుండా పరోక్షంగా కౌంటర్లు వేశారు. దాంతో వివాదం మరింత ముదిరింది. ఈ  కారణాల వల్లే ఇప్పుడు సాయి తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్ ఫాలో అవుతున్నారని టాక్ నడుస్తోంది. 

Updated Date - Jun 12 , 2024 | 05:24 PM