మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్, ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్‌తో నూతన చిత్రం ప్రారంభం

ABN, Publish Date - Apr 29 , 2024 | 09:21 PM

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది.

viraj

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ (ART MAKERS) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు మద్దుల మదన్ కుమార్ (MADAN KUMAR MADDULA) దర్శకత్వంలో కుమారి సౌజన్య కావూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చలన చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నూతన కథానాయకుడు రవితేజ మహాదాస్యం పై ‘బేబీ’ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ (VIRAJ ASWIN ) క్లాప్ కొట్టగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (PURANAPANDA SRINIVAS) మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వస్తున్న కొత్త తరం మేధస్సు, ఉత్సాహం, ప్రతిభ, సామర్ధ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సినీ రంగంలోకి వస్తున్న ఈ తరాన్ని కొందరు ఆక్షేపించి చులకనగా చూస్తున్నారు, తరువాత వీరి సృజనాత్మక సామర్ధ్యాన్ని చూసి ఈ వెటకారపు రాయుళ్లు ముక్కున వ్రేళ్లేసుకుంటున్నారు. ఇది జరిగిన చరిత్ర. జరుగుతున్న చరిత్ర. జీవితంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దని, ఎవ్వరినీ అవమానించొద్దన్నారు.


ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ నితిన్ రెడ్డి చిమ్ముల, ఎడిటింగ్: అఖిల్ దేశ్ పాండే, సంభాషణలు మరియు పాటలు జక్కా రాజశేఖర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ మక్కెన విజయ్, తేజస్విని డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సహా నిర్మాతలు: దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి.

Updated Date - Apr 30 , 2024 | 02:49 PM