Dear Uma: ఇండిపెండెన్స్ డేని ప్రతిబింబించేలా ప్రత్యేక స్టిల్ విడుదల

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:25 PM

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘డియర్ ఉమ’ మూవీ నుంచి ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా హీరోయిన్ సుమయా రెడ్డి స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకేసారి ఒక సినిమాకు పని చేయడం అంటే ఈ మధ్యకాలంలో అయితే ఇది సంభవించలేదనే చెప్పుకోవాలి. నిర్మాతగా, హీరోయిన్‌గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ సినిమాతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది.

Dear Uma Movie Independence Day Still

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘డియర్ ఉమ’ (Dear Uma) మూవీ నుంచి ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా హీరోయిన్ సుమయా రెడ్డి (Sumaya Reddy) స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకేసారి ఒక సినిమాకు పని చేయడం అంటే ఈ మధ్యకాలంలో అయితే ఇది సంభవించలేదనే చెప్పుకోవాలి. అనంతపురం నుంచి వచ్చిన అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయి సుమయా రెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది. నిర్మాతగా, హీరోయిన్‌గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ సినిమాతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఓ స్టిల్‌ (Independence Day Special Still)ని విడుదల చేశారు.

Also Read- Independence Day: స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుందాం.. స్టార్స్ ట్వీట్స్


ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ‌ని ఇవ్వబోతున్నాయనేలా హింట్ ఇచ్చాయి. ఈ మూవీతో కథా రచయితగా సుమయా రెడ్డి (Telugu Actress Sumaya Reddy) తన అభిరుచిని చాటుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం తాజాగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డేని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు.


నిర్మాతగా సుమయా రెడ్డికి ఇది మొదటి చిత్రమే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో రిచ్‌గా నిర్మిస్తున్నారని, ఒక మహిళగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తారని చిత్ర బృందం చెబుతుండటం విశేషం. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి రధన్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను స్పీడ్ పెంచుతామని మేకర్స్ తెలుపుతున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 15 , 2024 | 03:25 PM