Faria Abdullah: ఫరియా మత్తు వదిలింది.. టాలెంట్ చూపిస్తోంది

ABN, Publish Date - Aug 30 , 2024 | 06:43 PM

శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘మత్తు వదలరా’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తువదలరా 2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని రితేష్ రానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా తన టాలెంట్ చూపించినట్లుగా చెప్పుకొచ్చింది.

Mathu Vadalara2 Teaser Launch Event

హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా తమ ఒరిజినల్ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు తమ పాత్రకు వారే సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండగా.. ఇప్పుడో హీరోయిన్ ఏకంగా తనలోని టాలెంట్‌ని బయటపెట్టేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఇంతకీ ఫరియా ఏం చేసిందని అనుకుంటున్నారా? ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే.. ఆ సినిమాలో ఓ సాంగ్ రాసి, పాడి, ఇంకా ఆ పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది. మొత్తంగా నా టాలెంట్ చూపించే అవకాశం వచ్చిందని అసలు విషయాన్ని చెప్పేసింది ఫరియా అబ్దుల్లా.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

విషయంలోకి వస్తే.. శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘మత్తు వదలరా’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తువదలరా 2’ (Mathu Vadalara2) ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ..

Read Latest Cinema News

‘‘ఇప్పుడందరం ఒకే ఫేజ్‌లో వున్నాం, సేమ్ హ్యుమర్‌తో వస్తున్నాం. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీం ఇది. ఇది చాలా ఫన్ జర్నీ. మూవీ చూసినప్పుడు అందరికీ ఆ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో నేను ఓ పాట రాయడంతో పాటు పాడాను కూడా. అలాగే కొరియోగ్రఫీ కూడా చేశాను. త్వరలోనే ఆ పాట వస్తుంది. ఆడియన్స్ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్యూ ఆల్’’ అని ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చారు.


‘మత్తువదలరా 2’ టీజర్ విషయానికి వస్తే.. ‘Share this video to 10 members and win 1 kg of good luck absolutely free’.. అంటూ రితేష్ రానా మార్క్ హ్యుమర్‌తో ఈ టీజర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడిక్ ప్రెస్ మీట్‌ తర్వాత శ్రీ సింహ, సత్య హీ టీమ్ ఏజెంట్లుగా పరిచయం అయ్యారు. అయితే, ఏజెంట్లు దొంగలుగా మారడం ద్వారా నెరేటివ్‌లో ఊహించని మలుపులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టీజర్ రితేష్ రానా స్టైల్‌లో టీవీ సీరియల్ ఎపిసోడ్‌తో హిలేరియస్‌గా ముగిసింది. ఈ టీజర్ సూచించినట్లుగా ‘మత్తు వదలరా2’ మరో క్రేజీ ఎంటర్‌టైనర్ అవుతుందనే విషయం అర్థమవుతోంది. శ్రీ సింహ కోడూరి, సత్య పాత్రలు హిలేరియస్‌గా వున్నాయి. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్, రోహిణి తదితరుల పాత్రలన్నింటికీ ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Mathu Vadalara2 Teaser Launched)

Updated Date - Aug 30 , 2024 | 06:43 PM