Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ ఎంత హాట్‌గా వుందో చూశారా...

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:31 PM

2015లో వచ్చిన 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ నటనలో మంచి పేరు తెచ్చుకుంది. తరువాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా ఎందుకో ఎక్కువగా సినిమాలు చెయ్యలేదు. 2021లో వచ్చిన 'అఖండ' లో బాలకృష్ణకి జోడీగా నటించిన ప్రగ్యా జైస్వాల్ సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలని పెడుతూ అక్కడ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Pragya Jaiswal

తెలుగులో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ పేరు మారుమోగింది. అయితే ప్రగ్యా ఎక్కువగా తెలుగు సినిమాలు ఎందుకో వరసగా చెయ్యడం లేదు. కేవలం తనకి నచ్చితేనే చేస్తోంది అని అనుకోవచ్చు. 'కంచె' సినిమా 2015లో విడుదలైంది, వరుణ్ తేజ్ అందులో కథానాయకుడు, క్రిష్ దర్శకుడు. (Balakrishna Heroine is looking hot in her latest photos)

తరువాత 2017లో వరసగా నాలుగు తెలుగు సినిమాల్లో నటించింది ప్రగ్యా. అరంగేట్రం చెయ్యడం హిందీ సినిమా 'టిట్టూ ఎంబిఎ' తో అయినా, ఆ తరువాత ఎందుకో హిందీ సినిమాలు, వేరే ఇతర భాషా సినిమాలు చెయ్యలేదు ప్రగ్యా. (Akhanda Heroine Pragya Jaiswal is looking glamorous in her latest Photos)

దర్శకుడు క్రిష్ హిందీ సినిమా ' గబ్బర్ ఈజ్ బ్యాక్' కి దర్శకత్వం వహించినప్పుడు ప్రగ్యా ఆ హిందీ సినిమా కోసం ఆడిషన్స్ ఇచ్చింది. అప్పుడు ఆ సినిమాకి తీసుకోలేదు కానీ, క్రిష్ తరువాత తాను చేసిన 'కంచె' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ని కథానాయికగా తీసుకున్నాడు. అలా ఆ 'కంచె' సినిమా ప్రగ్యా జైస్వాల్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

2021 లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' సినిమాలో ప్రగ్యా జైస్వాల్, బాలకృష్ణకి జోడీగా నటించింది. ఆ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు, అందులో యువ బాలకృష్ణకి జోడీగా కలెక్టర్ పాత్రలో ప్రగ్యా నటించింది. అంతే ఆ సినిమా తరువాత మళ్ళీ తెలుగు సినిమా ఆమెది విడుదల కాలేదు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా వస్తున్న 'టైసన్ నాయుడు' అనే సినిమాలో ప్రగ్యా జైస్వాల్ విలన్ గా చేస్తోంది అని ఒక వార్త నడుస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, అతనికి ప్రత్యర్థి పాత్రలో ప్రగ్యా జైస్వాల్ చేస్తోంది అని ఒక టాక్.

ఇదే కాకుండా ఇప్పుడు బాలకృష్ణ, కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది అని ఇంకొక వార్త నడుస్తోంది. కానీ ఇది అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు, కానీ సామజిక మాధ్యమాల్లో మాత్రం ఆమె చేస్తోంది అని వార్త వైరల్ అవుతోంది.

Updated Date - Jul 27 , 2024 | 03:31 PM