Dhruv Vikram: అజయ్ భూపతి పెద్ద ప్లానే వేశాడుగా..

ABN, Publish Date - Sep 25 , 2024 | 05:05 PM

‘RX 100, మంగళవారం’ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇప్పుడందరి కన్ను పడింది. ఇప్పుడాయన ఓ క్రేజీ కోలీవుడ్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే..

Ajay Bhupathi

RX 100, మంగళవారం సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి కన్ను పడింది. ఆయన నుంచి వచ్చిన ‘మంగళవారం’ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ పరిశీలన లిస్ట్‌లోకి కూడా వెళ్లిందంటే.. అజయ్ భూపతి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడంతా తన తదుపరి ప్రాజెక్ట్ గురించే చర్చ నడుస్తోంది. అజయ్ భూపతి తన తదుపరి సినిమా కోసం ఓ క్రేజీ ప్లానే వేశాడు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌ (Dhruv Vikram)తో పెయిర్ కానున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్, పవర్ ఫుల్ యాక్టర్ కాంబో‌లో ఎలాంటి సినిమా రానుందో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

Also Read- Prakash Raj: ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోసారి పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్


‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో తమిళ ప్రజలకు యాక్టర్‌గా పరిచయమైన ధృవ్ విక్రమ్.. ఆ తర్వాత తండ్రి చియాన్ విక్రమ్‌తో ‘మహాన్’ (Mahaan) సినిమాలో నటించి తన యాక్టింగ్ కేపబిలిటీని అందరికి పరిచయం చేశాడు. అలాగే ఇప్పుడు పా రంజిత్ (Pa Ranjith) నిర్మాణంలో మారి సెల్వరాజ్ (Maari Selvaraj) దర్శకుడిగా ‘బిసోన్’ (Bison) అనే పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తాజాగా తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతితో జత కడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ బై లింగ్వల్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట. ఎవరూ ఊహించని ఈ కాంబో జతకట్టడంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ భూపతి రా టేకింగ్, ధృవ్ యాక్టింగ్ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్


అజయ్ భూపతి RX 100 రిలీజై అప్పట్లో ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక 2023లో ఆయన పాయల్ రాజపుత్ (Paayal Rajput)తో రెండో సారి జత కట్టి తీసిన ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ఏడాది భారత్ తరపున ఆస్కార్‌కి నామినేట్ చేసే సినిమాల జాబితాలో ఈ మూవీని పరిశీలించినా.. ఆ అదృష్టం మాత్రం బాలీవుడ్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్‌’ మూవీనే వరించింది.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2024 | 05:05 PM