Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:57 PM

దళపతి విజయ్ నటించనున్న చివరి చిత్రం ‘Thalapathy 69’ శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది. ఈ మూవీ ఓపెనింగ్‌కి ప్రధాన తారాగణం మొత్తం హాజరైంది. అయితే విజయ్ ఇంతకు ముందు చేసిన సినిమా నిర్మాత ఈ సినిమా వేడుకలో విజయ్‌కు ఓ బహుమతి ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

Thalapathy69 Movie Opening

దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించనున్న చివరి చిత్రం ‘Thalapathy 69’ శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ చాలా అప్డేట్స్ ఇచ్చారు. హీరోయిన్, ఇతర తారాగణం అంటూ కొన్ని వరుస అప్డేట్స్‌తో ‘Thalapathy 69’ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్‌లో అనుకోని సంఘటన జరిగింది. అదేంటని అనుకుంటున్నారా..

‘Thalapathy 69’ చిత్ర ఓపెనింగ్‌కి విజయ్ ఇంతకు ముందు చేసిన సినిమా ‘ది గోట్’ (The Goat) నిర్మాతలలో ఒకరైన శివ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ‘ది గోట్’ (The Goat) సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. తమిళ్‌లో పర్లేదు కానీ.. ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయినా సరే.. ఆ చిత్ర నిర్మాత ‘Thalapathy 69’ మూవీ ఓపెనింగ్‌లో పాల్గొని విజయ్‌ (Vijay)కు స్పెషల్ గిఫ్ట్‌ని ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే..

Also Read- Konidala Anjana Devi: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అంజనమ్మ సంచలన వ్యాఖ్యలు


‘GOAT’ అనే అక్షరాలతో ఉన్న గోల్డ్ రింగ్‌ని విజయ్‌కి నిర్మాత శివ బహూకరించారు. ఈ బహుమతిని అందుకున్న విజయ్.. సోషల్ మీడియా వేదికగా ఆ రింగ్‌ని చూపిస్తూ ఓ ఫొటోని షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘Thalapathy 69’ విషయానికి వస్తే ‘తుణివు, వలిమై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘బీస్ట్’ తర్వాత మరోసారి విజయ్‌తో జతకడుతోంది. బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ప్రధాన తారాగణం అంతా పాల్గొంది. విజయ్‌తో పాటు, దర్శకనిర్మాతలు, హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ వంటి వారంతా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఈ మూవీ అనంతరం విజయ్ పొలిటికల్‌గా బిజీ కానున్నారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైన విజయ్.. ఇటీవల నూతన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళనాడులో రాబోయే ఎన్నికల సమయానికి విజయ్.. ప్రజలతో మమేకం అయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం.

Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2024 | 05:03 PM