Malvi malhotra: మాల్వీ మామూలుగా లేదుగా.. ఏకంగా ప్రొడ్యూసర్‌కే!

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:03 PM

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అతనికి నార్సింగి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఎక్కడున్న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. అయితే తాజాగా మరో ట్విస్ట్‌ ఈ కేసును చుట్టుముట్టింది.

టాలీవుడ్‌ హీరో రాజ్‌ (Raj Tarun) తరుణ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అతనికి నార్సింగి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఎక్కడున్న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. అయితే తాజాగా మరో ట్విస్ట్‌ ఈ కేసును చుట్టుముట్టింది. మొన్నటివరకు ఈ గొడవలో ఉన్నవాళ్లలో ఎవరిది తప్పో అర్థం కాక సతమతమవుతుంటే.. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా (malvi malhotra) గురించి షాకింగ్‌ విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సంబంధిత వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మాల్వీ మల్హోత్రా.. సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత షార్ట్‌ ఫిల్మ్‌, ఆల్బమ్‌ సాంగ్‌, ఓటీటీల్లో పలు ప్రాజెక్ట్‌లు చేసింది. ‘తిరగబడరా సామీ’ మూవీతో తెలుగులోకి తెరకు పరిచయమవుతోంది.  సినిమా విడుదల కొద్ది రోజులు ఉందనగా, ఈ సినిమా హీరో రాజ్‌ తరుణ్‌ ప్రేయసి అంటూ లావణ్య మీడియా ముందుకొచ్చింది. తన ప్రియుడు రాజ్‌ తరుణ్‌ మాల్వీ మాయలో పడి తనని పట్టించుకోవట్లేదని, ఇదే విషయమై అడిగితే ఏకంగా మాల్వీ, ఆమె సోదరుడు తనని బెదిరిస్తున్నారని చెప్పి లావణ్య చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పోలీస్‌ కేసులు  పెట్టుకున్నారు. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం మాల్వీపై యోగేశ్‌ అనే ప్రొడ్యూసర్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన మాల్వీ అప్పట్లో ఆస్పత్రిలో చేరింది. తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని, లేదని చెప్పేసరికి ఇలా దాడి చేశాడని మాల్వీ చెప్పుకొచ్చింది. ఇది ఆమె వైపు మాట.

తాజాగా రాజ్‌ తరుణ్‌ కేసు మాల్వీ పేరు మీడియా హల్‌చల్‌ చేయడంతో బాధిత ప్రొడ్యూసర్‌ తల్లి మీడియా ముందుకొచ్చింది. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని, ఆస్తులు లాక్కొని తమని రోడ్డున పడేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని ఫిర్యాదు చేసి, తన కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిందని కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే యోగేశ్‌-మాల్వీ వాట్సాప్‌ చాట్‌, విమాన టికెట్స్‌ని బయటపెట్టారు. తన కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏమైనా గానీ ప్రస్తుతం హీరోయిన మాల్వీ మల్హోత్ర మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - Jul 16 , 2024 | 01:07 PM