శ్రీదేవి, జూహీల‌ది ‘లో సోసైటీ’.. నాటి న‌మ్ర‌త‌ కామెంట్స్‌.. ఇప్పుడు వైర‌ల్

ABN, Publish Date - Sep 27 , 2024 | 07:48 AM

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లపై నమ్రతా అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు హిందీ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతోంది.

namratha

కొన్నిసార్లు మ‌నం ఎప్పుడో చేసిన ప‌నులు, జ‌రిగిపోయినవి కొంత గ్యాప్ త‌ర్వాత మ‌న‌కు రివ‌ర్స్ త‌గ‌ల‌డం గురించి మ‌న‌కు తెలిసిందే. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో చెప్పిన‌ట్లు బ‌ట్ట‌ర్ ప్లై ఎఫెక్ట్ లాగా అప్పుడెప్పుడో, అక్క‌డ‌డెక్క‌డో జ‌రిగిన విష‌యానికి ఇప్పుడు రియాక్ష‌న్ ఉంటుంద‌న్న నానుడికి ప్ర‌స్తుత సంఘ‌ట‌న మంచి ఉదాహార‌ణ‌. ద‌శాబ్దాల క్రితం తెలిసి తెలియ‌క‌ మనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయటకు వ‌స్తే ఆవి తెచ్చే ఇబ్బందికర పరిస్థితులు మాములుగా ఉండ‌వు. ఇంకా అవ‌త‌లి వారిని విమ‌ర్శించిన‌ట్టుగానో ఉంటే అవి మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డే వారికి కూడా కొత్త త‌ల‌నొప్పులు తెస్తుంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu) స‌తీమ‌ణి, నాటి బాలీవుడ్ స్టార్ క‌థానాయిక నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) విష‌యంలో రుజువైంది. సుమారు రెండు, మూడు ద‌శాబ్దాల క్రితం న‌మ్ర‌త నాటి తోటి బాలీవుడ్ హీరోయిన్స్ శ్రీదేవి (Sridevi), జూహీ చావ్లా (Juhi Chawla), మాధురి దీక్షిత్ (Madhuri Dixit)లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

విష‌యానికి వ‌స్తే.. నమ్రతా శిరోద్కర్ 2005లో మహేష్ బాబుని పెళ్లి చేసుకునేంత వరకు బాలీవుడ్‌లో అగ్రతారలతో పోటీ పడుతూ మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి. ప్ర‌స్తుతం సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే కనిపిస్తారు. అదేవిధంగా అప్ప‌ట్లో అప్పుడ‌ప్పుడే డెవ‌ల‌ప్ అవుతున్న వెబ్‌సైట్లు, మ్యాగ్జిన్‌ల‌తో మంచి సంబంధాలు క‌లిగి ఉండి త‌రుచూ ఇంట‌ర్య్వూలు ఇస్తుండేది. అలాంటి ఓ సంద‌ర్బంలో నాటి రెడ్డిట్ (Redditt) సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఆమె ఫాన్స్‌తో చాట్ సెషన్స్ నిర్వహించారు. ఈ క్ర‌మంలో ఓ అభిమాని శ్రీదేవి, జుహీచావ్లాలు ఇండస్ట్రీ‌లో తమదైన ముద్ర వేశారు మరి మీ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారని అడిగారు. దీనికి న‌మ్ర‌త సమాధానం ఇస్తూ.. నేను ఖచ్చితంగా నా భవిష్యత్తుని కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని.. జుహీచావ్లా (Madhuri Dixit), శ్రీదేవి ఇద్ద‌రు లో సొసైటీకి చెందిన మనుషులంటూ వ్యాఖ్య‌లు చేసింది. నేను శ్రీదేవిని ఎప్పుడు కలవలేదు కానీ.. ఆమె మనుషులని సరిగ్గా రిసీవ్ చేసుకునే మనిషిలా కనిపించలేద‌ని, ఫ్రిడ్జ్‌లోని ఐస్ వంటిది అని చెప్పుకొచ్చింది.


ఇక మాధురి దీక్షిత్ గురించి అడగగా.. మాధురీ తనకు మంచి స్నేహితురాలే కానీ ఆమె అమ్మ చాటు అమ్మాయని మోడ్రన్ సొసైటీకి సింక్ అవ్వదు కానీ గొప్ప నటి అని చెప్పింది. ప్రస్తుతం ఈ చాట్ ఆర్కైవ్స్(Archives) నుంచి బయటపడటంతో శ్రీదేవి, మాధురి ఫాన్స్ నమ్రతాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా శ్రీదేవీ భర్త బోనీ కపూర్ అప్ప‌ట్లోనే నమ్రతాతో 'పుకార్' అనే సినిమా కూడా నిర్మించడం విశేషం.

కాగా.. అందరు అర్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే రెడ్డిట్ అనే ఈ సోషల్ మీడియా మాధ్యమం మొదట్లో అత్యంత సంపన్నులకు మాత్రమే ఎక్కువ‌గా అందుబాటులో ఉండేది. ఆ యాప్‌లో ఇలాంటి వివాదస్పద ప్రశ్నలు, సమాధానాలు, చాట్ సెషన్‌లు సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ కాస్త‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో శ్రీదేవి, జూహీ చావ్లా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 07:49 AM