Keerthy Suresh: ఏమాత్రం భయం లేదు.. అందుకే ఒప్పుకున్నా!

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:52 PM

మూసధోరణిలో కాకుండా విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్.

మూసధోరణిలో కాకుండా విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్(Keerthy SUresh). తాజాగా  ‘బేబీ జాన్‌’తో (Baby john) బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. సమంత, విజయ్‌ కాంబోలో వచ్చిన ‘తెరీ’ (Theri Remake) రీమేక్‌గా ఈ చిత్రం సిద్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.



‘‘తేరీ’లో సమంత పాత్రను చక్కగా చూపించారు. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా చాలా అందంగా నటించారు. సాధారణంగా రీమేక్‌లో నటించడం చాలా కష్టమైన పని. అలాంటి చిత్రాల్లో యాక్ట్‌ చేయాలంటే నాకు భయం. అయితే.. ‘బేబీ జాన్‌’లో యాక్ట్‌ చేయడానికి నేను ఏమాత్రం భయపడటం లేదు. ఎందుకంటే, హీరోయిన్‌ పాత్రను చాలా అద్భుతంగా రాశారు.  స్క్రీన్ పై  చక్కగా చూపించనున్నారు. కథ పరంగా చిత్ర బృందం ఎలాంటి మార్పులు చేయలేదు. ‘తేరీ’ విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత ‘బేబీజాన్‌’ తెరకెక్కుతోంది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న మార్పులు చేశారు. హిందీ మార్కెట్‌కు కావాల్సిన విధంగా ‘బేబీజాన్‌’ను సిద్థం చేయనున్నారు. నా పాత్ర అందరికీ చేరువవుతోంది. ఈ సినిమాపై నాకెన్నో ఆశలున్నాయి’’ అని అన్నారు. బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది.  వామికా గబ్బి కీలక పాత్రలో కనిపించనున్నారు. కాలీస్‌ దర్శకత్వంలో రానున్న ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ఇది విడుదల కానుంది.

Updated Date - Aug 11 , 2024 | 04:54 PM