Karan johar: థియేటర్లు ఖాళీ.. మౌనమే మూర్ఖులకు సమాధానం

ABN, Publish Date - Oct 13 , 2024 | 06:28 PM

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రలు పోషించిన ‘జిగ్రా’ దసరా కానుకగా శుక్రవారం విడుదలైంది. తాజాగా ఈ చిత్ర బృందంపై టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌కుమార్‌ భార్య, నటి దివ్య ఖోస్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌(Alia bhatt), వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రలు పోషించిన ‘జిగ్రా’ (jigra)దసరా కానుకగా శుక్రవారం విడుదలైంది. తాజాగా ఈ చిత్ర బృందంపై టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌కుమార్‌ భార్య, నటి దివ్య ఖోస్లా (Divya Khosla comments) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ కూడా ఫ్రీగానే ఉన్నాయి. ఫేక్‌ కలెక్షన్స్‌ ఎలా ప్రకటిస్తున్నారంటూ మండిపడ్డారు.



‘‘జిగ్రా’ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. హాలు మొత్తం ఖాళీగా ఉంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లే టికెట్లు కొనుగోలు చేసి.. ఫేక్‌ కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేస్తున్నందుకు అలియా భట్‌ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పెయిడ్‌ మీడియా సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రేక్షకులను వెర్రివాళ్లను చేయకూడదు.’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan johar) తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’’ అనే సందేశాన్ని ఇన్‌స్ట్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. దివ్య ఖోస్లా వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారని నెటిజన్లు భావిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా ‘జిగ్రా’ రూపొందింది. వాసన్‌ బాలా దర్శకత్వం వహించారు. తన తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా ఇది.  

Updated Date - Oct 13 , 2024 | 07:35 PM