40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kangana Ranaut: అయోధ్య రాజు తన స్వస్థలానికి వస్తున్న వేళ! 

ABN, Publish Date - Jan 21 , 2024 | 06:38 PM

వందల ఏళ్ల భారతీయుల కల సోమవారంతో నిజం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామయ్య ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి.

వందల ఏళ్ల భారతీయుల కల సోమవారంతో నిజం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామయ్య (Ayodhya Ram Mandir) ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. అందులో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కూడా పేరు కూడా ఉంది. ప్రస్తుతం ఆమె అయోధ్యలో ఉన్నారు. అయోధ్యలోని హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. అంతే కాదు ఆ గుడి ప్రారంగణాన్ని  చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడి ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆశీస్సులు తీసుకుంది. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘రామా.. ఇకనైనా వచ్చేయ్‌.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులు వారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడు యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్‌ రామా.. వచ్చేయ్‌’ అని ఇన్‌స్ట్టాగ్రామ్‌ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. 

తాజాగా కంగనా రనౌత్‌ తేజస్‌(Tejas) సినిమాలో నటించింది. ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్ర్టీమింగ్‌ అవుతోంది.  ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) సినిమాతో బిజీగా ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Updated Date - Jan 21 , 2024 | 06:41 PM