Kajol: ఆ మాత్రం తెలీదా... కాజోల్‌ ఫైర్‌

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:55 PM

దేశమంతా దసరా నవరాత్రులు (Dasara Navarathri) ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

దేశమంతా దసరా నవరాత్రులు (Dasare Navarathri) ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సెలబ్రిటీలు (bollywood celebrity) వినాయక చవితిని ఎంత ఘనంగా నిర్వహించుకుంటారో అంతకు మించి దసరా ఉత్సవాల్నిసెలబ్రేట్‌ చేసుకుంటారు. దుర్గా మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. దీని కోసం బాలీవుడ్‌ హీరోయిన్లు ఒక్కో రోజు ఒక్కో మండపంలో పూజలు నిర్వహిస్తుంటారు. అలా ఓ పూజా మండపానికి నటి కాజోల్‌ వెళ్లారు. ఆ మండపంలోకి కాళ్లకు చెప్పులు, షూలతో వచ్చిన కొందరు ఫొటోగ్రాఫర్‌లను, అభిమానుల్ని గమనించి ఆమె వారిపై ఫైర్‌ అయ్యారు.

"మీరు ముందు మీరు ఇక్కడ్నుంచి వెళ్ళండి. ఇది పూజా ప్రదేశం. చెప్పులు, షూలు తీసి రావాలని తెలీదా? ఇలాంటి ప్రదేశాల్లో కొంచెం గౌరవంగా వ్యవహరించండి అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్‌ అయింది. మైక్‌ తీసుకొని మరీ గట్టిగా అరిచింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫ్యాన్స్‌ ఆమె నిబద్ధతను, భక్తిని అభినందిస్తున్నారు. పూజా ప్రదేశాల్లోకి చెప్పులు వేసుకోకూడదని వాళ్లకు తెలీదా అంటూ ఫొటో గ్రాఫర్లపై మండిపడుతున్నారు.

Updated Date - Oct 12 , 2024 | 08:20 PM