Arshad Warsi: మాట మార్చని అర్షద్.. ప్రభాస్ బ్రిలియంట్ అంటూనే..

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:42 PM

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఎట్టకేలకు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభాస్ క్యారెక్టర్‌ని జోకర్ అంటూ అప్పట్లో కామెంట్ చేసిన అర్షద్ ఇప్పుడు పొగడడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రభాస్ (Prabhas) నటించిన 'కల్కి' (Kalki 2898 Ad) సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఎట్టకేలకు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభాస్ క్యారెక్టర్‌ని జోకర్ అంటూ అప్పట్లో కామెంట్ చేసిన అర్షద్ (Arshad warsi) ఇప్పుడు పొగడడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ ఈవెంట్లో అర్షద్ ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడంతో మరోసారి ఆయన వార్తలో నిలిచాడు.

కొన్ని నెలల క్రితం జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌లో అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. తాను మ్యాడ్ మ్యాక్స్, మెల్ గిబ్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే ప్రభాస్‌ని జోకర్‌గా తీర్చిదిద్దారని అర్షద్ విమర్శించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు అర్షద్‌పై రెచ్చిపోయారు. చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నాని కూడా ఈ వివాదంపై చురకలు అంటించారు. కాగా తర్వాత నాని అర్షద్‌కి క్షమాపణలు తెలిపారు. అయితే తాజాగా ఈ వివాదానికి అర్షద్ బ్రేక్ వేస్తూ.. 'ప్రభాస్ బ్రిలియంట్ యాక్టర్ అది ఎన్నో సార్లు నిరూపితమైంది. అది మనందరికీ తెలుసు. నేను కామెంట్ చేసింది ప్రభాస్‌పై కాదు సినిమాలో అతడి క్యారెక్టర్‌పై అంటూ క్లారిఫై చేశారు. అలాగే అన్ని ఇండస్ట్రీల హీరోలందరూ కలిసి సినిమాలు తీస్తూ ల్యాంగ్వేజ్ బేరియర్‌ని తొలిగిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' ఒరిజినల్ వెర్షన్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్' చిత్రాల్లో సర్క్యూట్ క్యారెక్టర్లో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న అర్షద్‌కి విలక్షణ నటుడిగా పేరుంది. తన ప్రదర్శనలతో ఎన్నో జాతీయ జాతీయ అవార్డులు కొల్లగొట్టిన అర్షద్ నెక్స్ట్ 'మున్నా భాయ్' సినిమా థర్డ్ పార్ట్ కోసం చర్చలు నడుస్తోన్నట్లు తెలిపారు.

Updated Date - Sep 29 , 2024 | 03:31 PM