సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Parasuram: మరో ప్రాజెక్ట్‌.. ఈసారి ఎవరితో అంటే..!

ABN, First Publish Date - 2023-02-16T15:40:16+05:30

2018లో ‘గీత గోవిందం’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు పరశురామ్‌. తదుపరి చిత్రానికి నాలుగేళ్ల సమయం తీసుకుని మహేశ్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2018లో ‘గీత గోవిందం’(Geetha govindam) చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు పరశురామ్‌(Parasuram petla). తదుపరి చిత్రానికి నాలుగేళ్ల సమయం తీసుకుని మహేశ్‌(maheshbabu)ని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు. గత ఏడాది మహేశ్‌-పరశురామ్‌ కాంబినేషన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కింది. ఆ చిత్రం యావరేజ్‌గా ఆడింది. తదుపరి చిత్రం ప్రకటించడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా ఒకే అయినట్లు ప్రకటించారు. ఈలోపే పరశురామ్‌ మరో ప్రాజెక్ట్‌ని సెట్‌ చేసుకున్నాడు. తమిళ హీరో కార్తీ (Parasuram to direct karthi)కోసం కథ రాశాడు పరశురామ్‌. ఇటీవల చెన్నైలో కార్తిని కలిశాడు కూడా. ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి కార్తి సరే అన్నట్లు తెలుస్తోంది.

కార్తికి తెలుగు సినిమాలపై ఎప్పటి నుంచో దృష్టి ఉంది. ఆ దిశగా ఫోకస్‌ కూడా పెట్టాడు. ‘ఊపిరి’ తరవాత తెలుగు డైరెక్ట్‌ సినిమా చేయాలని చాలా కథలు విన్నాడు. కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు పరశురామ్‌ కథ కార్తికి బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే పరశురామ్‌ మొదట విజయ్‌ దేవరకొండ సినిమా పూర్తి చేస్తాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతా ఓకే అయితే ఈ సినిమా తర్వాతే కార్తి సినిమా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.


Updated Date - 2023-02-16T15:53:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!