కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BB7 Fans Fight : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి... కారు ధ్వంసం!

ABN, Publish Date - Dec 18 , 2023 | 09:41 AM

బిగ్‌బాస్‌ ఉల్టాపుల్టా సీజన్  7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి గ్రాండ్‌ ఫినాలే పూర్తయింది. నాగార్జున విన్నర్‌, రన్నరప్‌లను ప్రకటించారు.

బిగ్‌బాస్‌ ఉల్టాపుల్టా సీజన్  7 (bigg Boss7)పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి గ్రాండ్‌ ఫినాలే పూర్తయింది. నాగార్జున విన్నర్‌, రన్నరప్‌లను ప్రకటించారు. ఇదంతా ముగిసిన అన్నపూర్ణ స్టూడియో వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. ఫినాలే పూర్తయిన తర్వాత అమర్‌ ఫ్యాన్స్ , రైతుబిడ్డ ప్రశాంత్  ఫాన్స్‌ గొడవకు దిగారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్తున్న సమయంలో అమర్‌ కారుపై ప్రశాంత అభిమానులు దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. మరో కంటెస్టెంట్‌ అశ్విని, గత సీజన కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ కారు అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే ఓ ఆర్‌టీసీ బస్సు ధ్వంసం చేశారు. దీంతో గీతూ రాయల్‌ పోలీస్‌ కేసు పెట్టింది. అద్దాలు ధ్వంసం చేసిన వీడియో క్లిప్‌ను అశ్విని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. (Fans Fight)

బిగ్‌బాస్‌ ఒక గేమ్‌ షో. కానీ ఆ షోకు సదరు ఇంటి సభ్యులకు అభిమానులం (Pallavi prasanth vs Amar deep fans) అని చెప్పుకునే వారికి అవన్నీ అసవసరం. షోలో తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్‌లో నామినేషన్స్‌లో భాగంగా అమర్‌, ప్రశాంత్‌ మధ్య చాలాసార్లు వాదనలు జరిగాయి. ఇదంతా గేమ్‌లో భాగమని అర్థం చేసుకోలేక ఈ ఫ్యాన్స అమర్‌, అతడి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో దాడి చేశారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ దాడికి దిగారు. 

Updated Date - Dec 18 , 2023 | 11:36 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!