సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akkineni Nargarjuna: మిస్ ఇండియాతో రొమాన్స్

ABN, First Publish Date - 2023-02-25T12:15:31+05:30

గత ఏడాది ‘బంగార్రాజు’, ‘ద ఘోస్ట్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. రైటర్‌ ప్రసన్న కుమార్‌ చెప్పిన కథకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గత ఏడాది ‘బంగార్రాజు’, ‘ద ఘోస్ట్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్కినేని నాగార్జున(Nagarjuna). ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. రైటర్‌ ప్రసన్న కుమార్‌ (Prasanna kumar) చెప్పిన కథకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయి. వచ్చే నెలలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇతర పాత్రధారుల్ని ఎంపిక చేసే పనుల్లో ఉందీ యూనిట్‌. అల్లరి నరేశ్‌(allari naresh)), రాజ్‌ తరుణ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. కథానాయిక ఎవరన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి(Manasa Varanasi)ని ఖరారు చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌ వినిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన మానస 2020 మిస్‌ ఇండియా విజేతగా నిలిచింది. 2021 మిస్‌ ప్రపంచ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడామెను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో కింగ్‌ విభిన్నబైన లుక్‌లో కనిపిస్తారట. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. (Manasa varanasi pair up with Nagarjuna)

Updated Date - 2023-02-25T12:20:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!