కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BiggBoss 7 : బిగ్‌బాస్‌ ఎమోషనల్‌ టాస్క్‌.. కాఫీ లేదంటూ వార్నింగ్‌!

ABN, First Publish Date - 2023-10-06T12:35:24+05:30

బిగ్‌బాస్‌ -7 (Biggboss 7) నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదోవారం నడుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిపోయారు. కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు విపరీతమైన టాస్క్‌లిచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

బిగ్‌బాస్‌ -7 (Biggboss 7) నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదోవారం నడుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిపోయారు. కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు విపరీతమైన టాస్క్‌లిచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా వారి ఇంటి నుంచి లెటర్స్‌ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రొమో విడుదల చేశారు. దానిలో ఏం చెప్పారంటే... (Letter task)

ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ నడుస్తోంది. దాని కోసం సభ్యులంతా జంటలుగా విడిపోయారు. ఆటలో వెనకబడి, తక్కువ స్టార్లు సొంతం  చేసుకున్న శోభాశెట్టి, ప్రియాంక కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించారు. అమర్‌ దీప్‌- సందీప్‌, శివాజీ- ప్రశాంత్‌, తేజ- యావర్‌, గౌతమ్‌- శుభశ్రీ నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లారు. తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించమని బిగ్‌బాస్‌ ఆదేశించారు. టేస్టీ తేజ, అమర్‌దీప్‌, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. యావర్‌కు తెలుగు బోధిస్తున్నారు. అల్లరి స్టూడెంట్‌ యావర్‌ అదరగొడుతున్నాడు. తెలుగు పండిట్‌గా ఉన్న తేజను, శోభాశెట్టిని ఓ ఆటాడుకున్నాడు. అమర్‌దీప్‌, ప్రియాంకలపై పంచల వర్షం కురిపించాడు. ఇక శివాజీ అతి ఏమాత్రం తగ్గలేదు. కాఫీ కోసం అలిగాడు. బిగ్‌బాస్‌ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ లేని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్‌ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరించసాగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్‌ కాఫీ ఇవ్వనంటాడు.. అని హౌస్లఓ గంతులేశాడు. అతను ఎంత ఓవరాక్షన చేసినా బిగ్‌బాస్‌ కాఫీ కూడా ఇవ్వలేదు.

ఇక కెప్టెన్సీ టాస్క్‌ విషయానికొస్తే టాస్క్‌లో భాగంగా 'చిట్టీ ఆయిరే’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఇంటి సభ్యులు అందరికి తమ ఇంటి నుంచి లెటర్స్‌ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్‌ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్‌ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్‌ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారు. ఈ విషయాన్ని ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్‌ ఆడటం లేదంటూ శివాజీ మైక్‌ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్‌ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్‌- శుభశ్రీ.. ఎవరు లెటర్‌ అందుకోవాలనే దాని గురించి కాేసపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభశ్రీ. గౌతమ్‌ ఏమో తన తండ్రి నుంచి వచ్చిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక మిగిలిన ఇద్దరూ యావర్‌- తేజా.. త్యాగానికి సిద్థపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్‌ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్‌ చదివి భావోద్వేగానికి గురయ్యాడు. ఏడవను అంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజా ఎపిసోడ్‌లో ఎవరు త్యాగం చేస్తారు. కెప్టెన పీఠం ఎవరు ఎక్కుతారో చూడాలి. అయితే కాఫీ విషయంలో శివాజీ చేస్తున్న రచ్చకు ుఅబ్బబ్బ ఏం ఆడితిరి ఏం ఆడితిరి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-10-06T12:35:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!