కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BB7 - Amar deep Fire : ఇంత మందిని ఏడిపించి, ఏం బాగుపడతారో..!

ABN, First Publish Date - 2023-09-15T17:04:56+05:30

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌ జోరు కొనసాగుతోంది. రెండో పవర్‌ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మాంచి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో రణధీర టీమ్‌ విజయం సాధించి తాళాలను సొంతం చేసుకున్నారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో (Biggboss 7) టాస్క్‌ జోరు కొనసాగుతోంది. రెండో పవర్‌ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మాంచి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో రణధీర టీమ్‌ విజయం సాధించి తాళాలను సొంతం చేసుకున్నారు. అయితే, మాయాస్త్ర పొందడం అనేది రెండు టీమ్‌లు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బిగ్‌బాస్‌ బాంబు రిస్క్‌లె పెట్టాడు. మహాబలి టీమ్‌లోని ఒక్కో సభ్యుడికి ఒక్కో అవకాశం వస్తుంది. అప్పుడు రణధీర టీమ్‌ గెలిచిన తాళాలను తీసుకుని, రణధీర సమూహంలో పవర్‌ అస్ర్తాను పొందడానికి అనర్హులో తగిన కారణం చెప్పి.. వాళ్ల దగ్గర ఉన్న మాయాస్త్ర బాగాన్ని అదే గ్రూప్‌లో ఉన్న మరొక సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చివరిలో మాయాస్త్ర భాగాలు రణధీర గ్రూప్‌లోని ఏ ఇద్దరి సభ్యుల దగ్గర ఎక్కువ ఉంటాయో వారు.. పవరాస్త్రను పొందేందుకు పోటీదారులుగా నిలుస్తారని బిగ్‌బాస్‌ తెలిపాడు.

ఈ ప్రక్రియలో మొదట ఎవరు వెళ్లాలి? చివరకు ఎవరు వెళ్లాలి? అన్న అంశంపై మహాబలి టీమ్‌లో తీవ్ర చర్చ జరిగింది. మొదట శుభశ్రీ తాళం తీసుకుని, శోభాశెట్టి మాయాస్త్రను పొందడానికి అనర్హురాలు అంటూ ఆమె వద్ద ఉన్న భాగాన్ని ప్రిన్స్‌ యావర్‌కు ఇచ్చింది. ఆ తర్వాత అమర్‌దీప్‌ వద్ద ఉన్న మాయాస్త్ర పార్ట్‌ను పల్లవి ప్రశాంత్‌ తీసుకుని, శివాజీకి ఇచ్చాడు. ఈ క్రమంలో రతికా రోజ్‌ను చివరిలో పంపేందుకు మహాబలి టీమ్‌ ఒప్పుకోకపోవడంతో ఆమె అడ్డం తిరిగింది. దామినితో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత వెళ్లడానికి కూడా రతిక ఒప్పుకోకపోవడంతో బిగ్‌బాస్‌ కలగజేసుకుని, ఎవరిని పంపాలో నిర్ణయించే అధికారం రణధీర టీమ్‌కు ఇచ్చాడు. అప్పటివరకూ మాయాస్త్రను పొందిన వాళ్లకే మిగిలిన భాగాలు ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో రతికా ఒప్పుకోక తప్పలేదు. మరోవైపు మాయాస్త్రను పొందడానికి పెట్టే మూడో టాస్క్‌లో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా, గౌతమ్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రిన్స్‌ యావర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రిన్స్‌ యావర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ అతని వద్ద ఉన్న మాయాస్త్ర భాగాన్ని గౌతమ్‌ మరొకరికి ఇవ్వడంతో ప్రిన్స్‌ కోపంతో ఊగిపోయాడు. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. నువ్వెంతా అంటే నువ్వెంత అని బలాబలాల దాకా వెళ్లిపోయారు. ‘ఇది సరైన గేమ్‌ కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డోర్‌ ఓపెన్‌ చేస్తే ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ పెద్ద పెద్ద కేకలు వేశాడు. ‘ఇంత మందిని ఏడిపించి, ఏం బాగుపడతారో అర్థం కాదు’ అంటూ అమర్‌దీప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-09-15T17:04:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!