కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bigg Boss Telugu 7: యావర్, రతిక ప్రేమలో పడ్డారా, నీ సరసాలు తగలెయ్య అన్న ప్రశాంత్

ABN, First Publish Date - 2023-09-21T14:27:56+05:30

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. మొన్నటి వరకు ప్రశాంత్ కి దగ్గరగా వున్న రతిక ఇప్పుడు యావర్ ప్రేమలో పడినట్టు కనపడుతోంది. శోభాశెట్టికి ఎక్కువ కారంతో వున్న చికెన్ తినమని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, అలాగే ఇంకో ముగ్గురికి కూడా, ఇంతకీ గెలుపు ఎవరిదీ...

Rathika and Prince Yawar in the Bigg Boss Telugu 7 season house

నాగార్జున (AkkineniNagarjuna) హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్ లో కథలు రోజుకో రకంగా మారుతున్నాయి. కానీ ఆసక్తికరం ఏంటంటే ఎక్కువగా రతిక (Rathika) పేరు వినిపిస్తూ ఉండటం. అదీ కాకుండా ఆమె ప్రేమ కథలు రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. తాజాగా స్టార్ మా ఒక వీడియో ప్రోమోని విడుదల చేసింది, అందులో రతిక, యావర్ (PrinceYawar) ప్రేమలో పడ్డట్టుగా కనపడుతున్నారు, వాళ్లిద్దరూ ఒకదగ్గర వున్నప్పుడు ప్రశాంత్ (Prashanth) 'నీ సరసాలు తగలెయ్య' అని అన్నాడు.

ఇంతకీ రతిక, యావర్ కిచెన్ లో మాట్లాడుకుంటూ వున్నారు. నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటా అంటూ యావర్, రతిక కి చెప్పడం, రతిక దానికి కొంచెం ఎమోషనల్ అవటం అతన్నీ చూస్తూ ఉండటం, ఇవన్నీ మిగతావాళ్ళు చూస్తూ కామెంట్ చెయ్యడం, ఈరోజు బిగ్ బాస్ లో వస్తున్న ఎపిసోడ్ అంటూ స్టార్ మా ఈ ప్రోమో పెట్టింది.

అలాగే రతిక కి యావర్ ఆహారం తినిపించాడు కూడా, దాన్ని కూడా మిగతా సభ్యులు చాలా విచిత్రంగా చూస్తూ వున్నారు. అయితే రతిక, ఇంతకు ముందు ప్రశాంత్ కి దగ్గరవడం ప్రేక్షకులు గమనించారు. అతనితో ఏవో గొడవలు, వివాదాలు వచ్చి విడిపోవటం, ఇప్పుడు ఆమె యావర్ కి దగ్గరవడం ఇవన్నీ చోస్తుంటే బిగ్ బాస్ లో కథ ఆసక్తికరంగా సాగుతోంది అని అంటున్నారు.

అంతకు ముందు బిగ్ బాస్ శోభాశెట్టికి (Shobhashetty) ఎక్కువ కారం వున్న చికెన్ తినమన్నాడు, కానీ ఆమె కొంచెం తినేసరికి కళ్ళనుండి నీళ్లు కారాయి. తినలేక, ఆ టాస్క్ పూర్తి చెయ్యలేక శోభాశెట్టి ఏడ్చింది, అయితే అమ్మకి మాటిచ్చాను ఏడవను అని మళ్ళీ తినడానికి ప్రయత్నం చేసింది. ఆ తరువాత అదే టాస్క్ ని ముగ్గురికి ఇచ్చాడు బిగ్ బాస్. అందులో శుభ (Shubha), ప్రశాంత్, గౌతమ్ (Gautham) ల ముందు మూడు చికెన్ తో వున్న గిన్నెలను పెట్టి ఎవరు తొందరగా తింటారో వాళ్ళకి శోభా స్థానంలో కంటెండర్ గా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పడం తో వాళ్ళు కూడా తిండటం మొదలెట్టారు. మరి ఈ ముగ్గురిలో ఎవరి టాస్క్ తొందరగా పూర్తి చేసి విజేతగా నిలిచారో చూడాలి ఈరోజు.

Updated Date - 2023-09-21T14:27:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!