Pindam : ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ABN, Publish Date - Dec 19 , 2023 | 12:31 AM
తమిళ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ‘పిండం’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా సోమవారం సక్సెస్ మీట్...
తమిళ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ‘పిండం’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘నాకు 18 ఏళ్ల తర్వాత సోలో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా దర్శకుడు సాయికిరణ్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా సినిమాను తీర్చిదిద్దారు. నిజాయతీగా సినిమా తీస్తే ఆదరించి, విజయాన్ని అందిస్తారనే నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి కలిగించారు. నిర్మాత యశ్వంత్గారు ముందు ముందు మరిన్ని చిత్రాలు తీయాలి’ అన్నారు. ‘ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు ఇన్ని థియేటర్లలో ఇంత భారీగా విడుదలవుతుందని ఊహించలేదు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సాయికిరణ్.