Minister Komati Reddy Venkata Reddy : నంది పురస్కారాలు ఇస్తాం
ABN, Publish Date - Dec 30 , 2023 | 05:16 AM
వచ్చే ఏడాది ఉగాది నుంచి నంది పురస్కారాలు ఇవ్వడాన్ని తిరిగి కొనసాగించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ
వచ్చే ఏడాది ఉగాది నుంచి నంది పురస్కారాలు ఇవ్వడాన్ని తిరిగి కొనసాగించనున్నట్లు విబి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన వెండితెర అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి
వెంకటరెడ్డి చెప్పారు. సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నంది పురస్కారాల గురించి ఇప్పటికే చర్చించాను. త్వరలోనే సినీ ప్రముఖులను సీఎం వద్దకు తీసుకెళతాను’ అన్నారు.