కొంగొత్త ప్రేమకథ
ABN, First Publish Date - 2023-03-23T01:48:46+05:30
యోగీశ్వర్, అతిథి జంటగా సాయిశివాజీ దర్శకత ్వంలో రూపొందిన చిత్రం ‘పరారి’. జి.వి.వి గిరి నిర్మాత. సుమన్, మకరంద్ దేశ్ముఖ్, అలీ కీలకపాత్రలు పోషించారు...
యోగీశ్వర్, అతిథి జంటగా సాయిశివాజీ దర్శకత ్వంలో రూపొందిన చిత్రం ‘పరారి’. జి.వి.వి గిరి నిర్మాత. సుమన్, మకరంద్ దేశ్ముఖ్, అలీ కీలకపాత్రలు పోషించారు. మార్చి 30న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ అంటూ సాగే గీతాన్ని నటి విజయశాంతి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ‘యోగీశ్వర్ తొలి చిత్రం అయినా డాన్స్ బాగా చేశాడు. ‘పరారి’ చిత్రం విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. ప్రేక్షకులకు ఈ చిత్రంలోని ప్రేమకథ కొత్త తరహా అనుభూతిని పంచుతుందని నిర్మాత తెలిపారు. ‘పరారి’లోని పాటలన్నీ ప్రేక్షకాధరణ పొందటం ఆనందాన్నిచ్చిందని సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ చెప్పారు. హీరోగా నా మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి అని యోగిశ్వర్ కోరారు.