సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pankaj Tripathi: టెర్రరిజంపై మూవీ.. నిర్మాతలపై కేసు వేసేందుకు సిద్ధమైన నటుడు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2023-02-28T10:30:21+05:30

‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). ఆయన తెలుగుతోపాటు ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ పలు సినిమాలు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). ఆయన తెలుగుతోపాటు ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ పలు సినిమాలు చేశాడు. కానీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్‌తోనే ఆయన ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అయితే ఈ నటుడు తన నటించిన ఓ సినిమాకి సంబంధించిన నిర్మాతలపై కేసు ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

పంకజ్ త్రిపాఠి ఐదేళ్ల క్రితం ‘అజంగఢ్’ (Azamgarh) అనే చిత్రంలో నటించాడు. ట్రెర్రరిజంపై తెరకెక్కిన ఆ మూవీలో యువకులను తీవ్రవాదం వైపు నడిపించే మౌల్వీగా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కమలేష్ కే మిశ్రా (Kamlesh K Mishra) దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లో పలు కారణాల వల్ల విడుదలకి నోచుకోలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఈ మూవీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే పాపులారిటీ ఉన్న పంకజ్ త్రిపాఠి పేరు ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. పలు పోస్టర్లపై పంకజ్‌కి సంబంధించిన ఫొటోలను వాడుతున్నారు. ఇది ఆయన కోపానికి కారణమైంది.

ఇది కూడా చదవండి: Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

పంకజ్ ప్రస్తుతం ‘ఓ మై గాడ్ 2’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ తరుణంలో ‘అజంగఢ్’ ప్రమోషన్స్ వల్ల ఆ సినిమాకి ఏదైనా సమస్య వస్తుందని ఆయన భావిస్తున్నాడు. అలాగే ఇలాంటి చీప్ పబ్లిసిటీ తనకు నచ్చకపోవడంతో నిర్మాతలతో మాట్లాడి.. వారు ఒప్పుకోకపోతే కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-28T10:35:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!