ఈ సినిమాలోని ఘటనలు రియల్గా జరగకూడదని కోరుకుంటున్నా: తనీష్
ABN, First Publish Date - 2021-09-16T23:19:53+05:30
చాలా రోజుల తర్వాత ఇలాంటి వేడుక చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అందరం ఎంతో కష్టపడి ఈ చిత్రం చేయడం జరిగింది. సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది. ప్రతి నటుడు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ..
యంగ్ హీరో తనీష్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా జాని దర్శకత్వంలో రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో.. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం చూసే ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆర్టిస్ట్ల నటన, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. చాలా తక్కువ టైమ్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్డౌన్ వల్ల విడుదల ఆలస్యమైంది. ఈ నెల 24న థియేటర్స్లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని తెలుపగా.. చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. నా గత చిత్రం ‘అంతకుమించి’ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్త తరహా కథతో సినిమా చేయాలని ఈ చిత్ర కథను డిజైన్ చేసుకున్నాను. నా కథ నచ్చి నిర్మాతలు వెంటనే సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. సింగిల్ షాట్లో కమర్షియల్ సినిమా తీసి అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చేయాలనుకుని ఈ కథను రాసుకొన్నాను. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్ జరగలేదు. ఫస్ట్ రిహర్సల్ చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. అందరూ ఈ సినిమాకి మనసు, ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు. అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.
హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. ఈ చిత్రం నాకు వెరీ స్పెషల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. విలన్గా చేసిన కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ.. సింగల్ షాట్ మూవీ అయిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. నేను సౌత్లో దాదాపు 50 చిత్రాల్లో నటించాను. కానీ ఏ సినిమాలో డాన్సులు చేసే అవకాశం రాలేదు. ఈ చిత్రంలో నాతో దర్శకుడు జాని డ్యాన్స్లు చేయించారు. నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా విలనీని ఈ చిత్రంలో చేశాను. అందరికీ ధన్యవాదాలు.. అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఇలాంటి వేడుక చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అందరం ఎంతో కష్టపడి ఈ చిత్రం చేయడం జరిగింది. సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది. ప్రతి నటుడు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా ఇది. ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నాం. చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఎవరో తెలియని వక్తి వచ్చి ఆ అమ్మాయి లైఫ్ను డిసైడ్ చేస్తున్నాడు. ఇలాంటి ఎలిమెంట్ ఉన్న కథను ఈ చిత్రంలో చూస్తారు. సోషల్గా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఏర్పడుతోంది. వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో ఉన్నటువంటి సందర్భాలు బయట ఉండకూడదు అని కోరుకుంటున్నాను. మనం సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మరో ప్రస్థానం సినిమాను ఈ నెల 24న థియేటర్లలోనే విడుదల చేస్తున్నాము..’’ అన్నారు.