విష్వక్సేన్ ‘పాగల్’ సినిమా ప్రారంభం
ABN, First Publish Date - 2020-03-19T21:49:24+05:30
‘హిట్’ మూవీ తర్వాత విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం
‘హిట్’ మూవీ తర్వాత విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విష్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా యూనిట్కు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు స్క్రిప్ట్ అందజేశారు. ఈ ప్రారంభ వేడుకలో చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యూనిట్కు శుభాకాంక్షలు అందజేశారు.
అనంతరం హీరో విష్వక్సేన్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్గా అనిపించడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించా. ఇప్పటివరకు నేను చేయని జానర్లో ‘పాగల్’ సినిమా ఉంటుంది..’’ అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..‘‘ విష్వక్సేన్తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ సినిమా తీస్తున్నాము. మంచి ముహూర్తం కావడంతో ఈ రోజు లాంఛనంగా సినిమాని ప్రారంభించాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాము. నరేష్లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది..’’ అని చెప్పారు.
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. ‘‘విష్వక్సేన్ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నాము. టైటిల్ని బట్టి ఇది యాక్షన్ సినిమానా అని అడుగుతున్నారు. లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు కచ్చితంగా ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ఈ సినిమా ఇస్తుంది..’’ అన్నారు.