డ్రగ్స్ విషయంలో ప్రముఖంగా వినిపించిన సెలబ్రిటీలు వీరే!

మైఖేల్ జాక్సన్: 50 ఏళ్ల జాక్స‌న్ త‌న మృతికి ముందే చాన్నాళ్ల నుంచి డ్ర‌గ్స్‌కు బానిసయ్యాడని, ఆయన మృతికి కారణం కూడా ఆ డ్రగ్సే అని ఇప్పటికీ ప్రముఖంగా చెప్పబడుతోంది.

సంజయ్ దత్: నేను తీసుకోని డ్రగ్స్ లేనేలేవంటూ.. పబ్లిక్‌గా ఈ ఖల్ నాయక్ అప్పట్లో తెలిపారు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: బాలీవుడ్‌లో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ కలకలం మొదలైంది. ఆయన మరణానికి కారణం డ్రగ్సే అనేలా ఇప్పటికీ వినబడుతోంది.

రియా చక్రవర్తి: సుశాంత్ మృతి తర్వాత రియా పేరు డ్రగ్స్ కోణంలో బాగా వైరలైంది. కొన్నాళ్ల పాటు రియా జైలు శిక్షను కూడా అనుభవించింది.

రియా చక్రవర్తి ఇంటరాగేషన్‌ అనంతరం దీపికా పదుకునె, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ సోదరుడి పేర్లు బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ డ్రగ్స్ విషయంలో కొన్నాళ్ల పాటు రిమాండ్‌లో ఉండి విచారణను ఎదుర్కొన్నాడు.

టాలీవుడ్‌లో పూరి జగన్నాధ్, రవితేజ, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, ఛార్మీ వంటి వారిని డ్రగ్స్ కేసు నిమిత్తం పిలిచి ఎంక్వైరీ చేశారు.

తమిళనాడుకు చెందిన ఓ నిర్మాత.. ఇటీవల రూ. 2వేల కోట్ల డ్రగ్స్‌తో ముంబైలో పట్టుబడటం చర్చనీయాంశమైంది.

శాండిల్ వుడ్‌లో రాగిణి త్రివేది, సంజన‌ గల్రానీ లను అరెస్ట్ చేసి, విచారణ అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.

రీసెంట్‌గా ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ పేరు ఈ విషయంలో బాగా వైరలైంది.

ప్రస్తుతం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగిన రైడ్‌లో సెలబ్రిటీలు కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి పేర్లు ఇంత వరకు బయటకు రాలేదు.