వ‌ర‌ల‌క్ష్మి, విశాల్ రొమాన్స్ చిత్రం.. 12 యేండ్ల తర్వాత థియేట‌ర్ల‌లోకి?

విశాల్ హీరోగా నటించిన ఓ చిత్రానికి‌ పుష్కరం తర్వాత మోక్షం లభించిన‌ట్లు తెలుస్తోంది

గతంలో సుందర్ సి దర్శకత్వంలో ఆయన నటించిన ‘మద గద రాజా’ చిత్రం ఇప్పుడు విడుదలకు

సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్‌లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి

అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా తెలుగమ్మాయి గాయత్రి ఓ పాత్ర చేసింది

2012లో పూర్తి చేసిన ఈ చిత్రం అర్థిక స‌మ‌స్యలతో 12 యేళ్ళుగా అటకెక్కింది

అప్పటికే తెలుగులోనూ అడియో పంక్షన్

వంటి కార్యకమాలు నిర్వహించి  విడుదల తేదీ ఖరారు చేశారు కానీ

 కానీ సినిమా విడుదల ఆగి పోయింది

షూటింగ్ లో భాగంగా సదాపై   ఐటం సాంగ్ కూడా చిత్రీకరించారు

 ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు

ఇటీవల సుందర్‌ దర్శకత్వం వహించిన అరణ్మనై-4 ఘన విజయం సాధించడంతో

ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు

ఈ సినిమాను ఆగ‌స్టు 8న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది

కానీ అధికారికంగా ప్ర‌క‌ట‌న రాలేదు

ఈ సినిమా స‌మ‌యంలోనే విశాల్‌కు వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి

ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి

ఈ వార్తలను తర్వాత విశాల్ ఖండించారు

 ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి ఓ వ్యాప‌ర‌వేత్త‌ను పెళ్లి చేసుకోగా విశాల్ బ్యాచ్‌ల‌ర్‌గానే ఉన్నాడు