చైతూతో నిశ్చితార్థంపై శోభితా సంచలన వ్యాఖ్యలు

నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్య ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే.

చైతూ, సమంతల విడాకుల అనంతరం.. శోభితతో చైతూ ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.

ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడంలో చైతూ, శోభిత ఇద్దరూ సక్సెస్ అయ్యారు.

వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుంది. అయితే,

ఎంతో సింపుల్‌గా జరిగిన ఎంగేజ్‌మెంట్‌ గురించి తాజాగా శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిశ్చితార్థం‌పై శోభితా ధూళిపాళ ఏమన్నారంటే..

నిశ్చితార్థ వేడుకను గ్రాండ్‌గా చేసుకోవాలని ముందుగా ప్లాన్‌ చేయలేదు.

ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కలలు కనలేదు.

జస్ట్‌.. జీవితంలో అతి ముఖ్యమైన ఆ మధురక్షణాలని ఆస్వాదించాలని అనుకున్నాను.

తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని కోరుకునేదాన్ని.

ఇది ఇలాగే జరిగింది.

కాబట్టి ఈ వేడుక నిరాడంబరంగా జరిగిందని అనుకోవట్లేదు.

నా వరకూ ఇదో పర్ఫెక్ట్‌ పద్దతిలో సాగిన వేడుక.. అంతే.

ఆగస్టు 8న చైతూ, శోభితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

ఈ నిశ్చితార్థ విషయాన్ని కింగ్ నాగ్ అధికారికంగా తెలియజేశారు.