చిరంజీవి నటించిన 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ ప్రత్యేకతలివే 

చిరంజీవి  జయంత్‌ సి.పరాన్జీ కాంబోలో వచ్చిన  'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ 20 వసంతాలు పూర్తి చేసుకుంది.

'మున్నభాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 15 2004లో విడుదలైంది.

కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో  సోనాలి బింద్రే కథానాయికగా నటించింది

వినోదం, భావోద్వేగం, చక్కని సందేశంతో రూపొందిన ఈ చిత్రం ఇంద్ర, ఠాగూర్‌  చిత్రాల స్థాయిలో విజయం అందుకుంది

ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో 'సందే పొద్దు లత్తాంటే.. దీని దిమ్మతీయ’ పాటను జోడించారు.

చిరంజీవి, సోనాలి బిండ్రేపై చిత్రీకరించిన ఈ పాట బయ్యర్లకు ఎక్సట్రా బోనస్‌ను,  ప్రేక్షకులకు ఎక్ర్స్టా వినోదాన్ని అందించింది.  .

ఈ చిత్రంలో అన్ని పాటలు సూపర్‌హిట్టే. అయినప్పటికీ ఇందులో ఓ పాటకు మరింత ప్రత్యేకత ఉంది

చిరంజీవి, ముంబై బోల్డ్‌ బ్యూటీ గౌహర్‌ఖాన్‌లపై తెరకెక్కించిన 'నా పేరే కాంచర మాల’ ఓ ఊపు ఊపింది

ఈ పాటలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్  గెస్ట్‌ అపీయరెన్స్‌ ఇవ్వడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి

'పట్టుపట్డు చెయ్యే   పట్డు ' సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కథానాయిక సోనాలి బింద్రే మూడు నెలల కడుపుతో ఉన్నా  పూర్తి చేశారు

టైటిల్‌ సాంగ్‌కు నుంచి ప్రత్యేక గీతం వరకూ తన మార్క్‌ చూపించారు రాక్‌స్టార్‌ డిఎస్‌పి.

ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ సహాయ నటుడిగా శ్రీకాంత్ కు  ఫిలిం ఫేర్ అవార్డ్స్ వరించాయి