అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ఇప్పుడు చాలా చురుకుగా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. మయోసిటిస్ వ్యాధి నుండి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగానే కనపడుతోంది

2012లో సమంత ఒకసారి అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు కోలుకున్నాక సమాజానికి తాను ఏదైనా మంచి పని చెయ్యాలన్న తలంపుతో 'ప్రత్యూష' అనే సంస్థని స్థాపించారు. 

ప్రత్యూష సంస్థ ద్వారా పేద మహిళలకు, పిల్లలకి వైద్య సహకారాలు ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

సమంత తన పారితోషికంలో కొంత భాగం పేద పిల్లల  వైద్యానికి విరాళంగా ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు 

అక్టోబర్ 29, 2022 న తాను మయోసిటిస్ అనే వ్యాధిబారిన పడినట్టు తన అభిమానులతో వార్తని పంచుకున్నారు 

ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది, ఆ సమయంలోనే అంటే 2023లో 'ఖుషి' సినిమా పూర్తి చేయగలిగారు

అక్టోబర్ 6, 2017న అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత, అక్టోబర్ 2, 2021న తాము విడిపోతున్నట్టు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు 

సమంత 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ కూడా చేశారు, ఇది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రాజ్ డీకే లు దర్శకులు, వరుణ్ ధావన్ కథానాయకుడు. 

ఈమధ్య సమంత సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా వున్నారు, త్వరలోనే మళ్ళీ కెమెరా ముందుకు రావచ్చు అని అనుకుంటున్నారు