నాంపల్లి కోర్టులో నాగార్జున  వాంగ్మూలం

నాగచైతన్య- సమంత విడాకులకు కేటీఆర్ కారణం అని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాయి.

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పిటిషన్ వేశారు. 

 ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది.

నాగార్జున స్టేట్‌మెంట్‌ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది

కోర్టుకు నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల హాజరయ్యారు.

మా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు 

రాజకీయ దురుద్దేశంతో  మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. 

మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది’’ అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు.

10వ తేదీకి కేసు  విచారణను వాయిదా వేసింది.