శోభిత ధూళిపాళ్ల పట్టు చీర ధరించి సంప్రదాయంగా కనిపించారు

నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల త్వరలో  పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే.

ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా  జరిగింది. తాజాగా పెళ్లి పనులు మొదలయ్యాయి.

సోమవారం పసుపు దంచే  కార్యక్రమంతో పెళ్లి పనులు  మొదలెట్టారు.

ఈ ఫోటో లను సోషల్  మీడియాలో  షేర్   చేశారు.

  గోధుమ రాయి పసుపు  దంచడంతో  పనులు ప్రారంభమయ్యాయి’  అని క్యాప్షన్‌ పెట్టారు.

ఎరుపు రంగు పట్టు చీరలో  శోభిత సంప్రదాయబద్దంగా  మెరిసిపోతూ కనిపించారు.

శోభిత కుటుంబ సభ్యులతో  కలిసి గణపతి పూజ  నిర్వహించారు.

ఫొటోలు చూసిన అభిమానులు   పెళ్లి ఎక్కడ, ఎప్పుడు అని  అడుగుతున్నారు.

పసుపు దంచిన అనంతరం  శోభిత పెద్దల ఆశీస్సులు  తీసుకుంది.

శోభిత ఇంట్లో పెళ్లి పనులు  మొదలైనట్లు తెలుస్తుంది.  అక్కినేని కుటుంబం నుంచి  పెళ్లికి సంబంధించిన ఎలాంటి  వార్తా బయటకు రాలేదు.

ఈ నెలలోనే    పెళ్లి వేడుక నిరాడంబరంగా  ఉంటుందని సమీప బంధువులు,  సన్నిహితులు మాత్రమే   హాజరవుతారట