మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడి కేసులో కోర్టు తీర్పు ఇదే..

తనతో పెళ్లికి నిరాకరించిందంటూ కథానాయిక మాల్వీ మల్హోత్రాపై 

కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో నిర్మాత యోగేశ్‌ సింగ్‌ను దోషిగా తేల్చిన ముంబై కోర్టు 

అతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పుపై మాల్వీ ఆనందం వ్యక్తం చేశారు. 

తన పోరాటం ఫలించిందని సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆమె స్పందిస్తూ..

ఈ పోరాటంలో ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొన్న నాకు తీర్పుతో ఉపశమనం లభించింది. 

నాలుగేళ్లుగా పోరాడుతున్నాను. ఎట్టకేలకు నిజం గెలిచింది.

న్యాయం దక్కేవరకూ పోరాడే శక్తినిచ్చిన అమ్మవారికి ధన్యవాదాలని మాల్వీ పేర్కొంది. 

2020లో తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో మాల్వీని అడ్డగించిన యోగేశ్‌ కత్తితో దాడి చేశాడు.

కాగా.. మాల్వీ, రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే.