మహానటి' కొత్త సినిమా.. బార్బీ గర్ల్‌గా క్యూట్ లుక్ వైరల్

మహానటి'గా దేశ వ్యాప్తంగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.

'కీర్తి' ప్రముఖ మలయాళ నిర్మాత సురేష్ నటి మేనకా దంపతులకు 1992లో జన్మించింది.

 2000 సంవత్సరంలో తన తండ్రి ప్రొడక్షన్‌లో నిర్మించిన పైలట్స్ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్‌గా బుల్లి తెరకు పరిచయమయ్యారు.

2013 గ్రాడ్యుయేషన్ సమయంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'గీతాంజలి' సినిమా ద్వారా మలయాళ సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి తెరంగ్రేటం చేశారు.

 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమాలో వెంకట్ ప్రభు సరసన నటించి తమిళ సినిమాకి పరిచయమయ్యారు.

2015లోనే 'ఐన ఇష్టం' అనే తెలుగు సినిమా చేయాల్సిన్న అది ఆగిపోయింది.

ఎట్టకేలకు 2016లో హీరో రామ్ 'నేను శైలజా' మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

 2018లో సావిత్రి బయో పిక్  'మహానటి'లో నటించి దేశం మొత్తంతో శబాష్ అనిపించుకున్నారు.

తాజాగా 'రఘు తాత' అనే తమిళ పొలిటికల్ కామెడీ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పింక్  కలర్ ఫ్లోరల్ డ్రెస్‌లో క్యూట్ బార్బీ గర్ల్‌‌గా కనిపించారు.